Followers

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు


 


 


బాల్య వివాహాలపై అవగాహన సదస్సు



--బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు.


 


వీ.ఆర్.పురం,  పెన్ పవర్ 



వీ.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామం ఏ. ఎస్.డీ.ఎస్ ప్రాంగణంలో గురువారం బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు అద్వర్యం బాల్యవివాహల గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు మాట్లాడుతూ గ్రామల్లో పనిచేయుచున్న వాలేంట్రీలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు గ్రామల్లో జరుగుతున్న బాల్యవివాహలపై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారా నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. వీ.ఆర్.పురం మండలం ఐ.సి.డీ.ఎస్ ప్రాజెక్ట్ అధికారి వై.పద్మావతి మాట్లాడుతూ శిసు మరణాలు, పిల్లలకు పోషకాహారం, గురించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని. గర్భిణి స్త్రీలకు మెరుగైన ఆహారం అందిచాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి డి.ఓ శ్రీనివాస్ రావు, వీ.ఆర్.పురం ఎస్.ఐ వెంకట్, రెవెన్యూశాఖ, సూపరు వైజర్లు, సెక్రెటరులు తదితరులు పాల్గొన్నారు.


పిన్న వయసులో "బాట్" రూపొందించిన తొలి బాలిక జోషిత నీలం


పిన్న వయసులో "బాట్" రూపొందించిన తొలి బాలిక జోషిత నీలం


గండేపల్లి పెన్ పవర్!


 


గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ హబ్ సి.ఈ.ఓ బాబ్జి నీలం కుమార్తె జోషిత నీలం.  ప్రపంచంలోనే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ద్వారా బాట్ రూపొందించిన పిన్న వయసు (13సంవత్సరాలు) తొలి బాలికగా గుర్తింపు సాధించినట్లు బాబ్జి తెలియజేసారు. సామర్లకోట మండలం ఉండూరు లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు 9వ తరగతి చదువుచున్న జోషిత ఆటోమేషన్ ఎనీవేర్ యూనివర్సిటీ నుండి ఇ -లెర్నింగ్  ద్వారా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో ఆడ్వాన్సుడ్ సెటిఫికేషన్ పూర్తిచేసినట్లు వివరించారు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డా. సుగుణారెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో అడ్వాన్సు సర్టిఫికేషన్ కోర్స్ చేయడమే కాకుండా చక్కటి ప్రతిభతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం అభినందనీయం అని,ప్రతి ఒక్కరూ జోషితను ఆదర్శంగా తీసుకొని లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఉన్నత స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. రాష్ట్ర స్థాయి చదరంగం క్రీడాకారిణి అయిన జోషితకు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి,డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి,డా. ఎమ్. శ్రీనివాసరెడ్డి,లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. సాత్యకీ బెనర్జీ,లు అభినందించారు.


చిట్టిబాబుకు తోట రాంజీ పరామర్శ 


చిట్టిబాబుకు తోట రాంజీ పరామర్శ 


గండేపల్లి పెన్ పవర్


 మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం కుమారుడు తోట రాంజీ పరామర్షించరు, గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో  ఇటీవలే  స్వర్గస్తులైన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కందుల కొండయ్య దొర ఇంటికి వచ్చి పరామర్చించి కొండయ్య దొర సోదరుడైన చిట్టిబాబుని  జరిగిన సంఘటన  గురించి అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతి తెలియపరిచారు తోట రాంజీ వెంట ఐ వి రాంబాబు మట్టా బాపిరాజు తధితరులు వున్నారు.


 పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి 


 పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి 


రాయవరం పెన్ పవర్


ఈరోజు మండల కేంద్రం రాయవరం లో తమలపూడి గంగాధర్ రెడ్డి ఆఫీస్ నందు మంతెన అచ్యుత రామరాజు, గంగాధర్ రెడ్డి, బొడ్డు శ్రీను సమక్షంలో రాయవరం మండలం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్.డా. పలివెల ప్రసాద్ తన కమిటీ సభ్యులతో సహా మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు: రెవ.కొమ్ము సోమశేఖర్, బక్కి సత్య దాస్, తాతపూడి నతానియేలు సమక్షంలో రెండు కమిటీలు ఒకటిగా చేసియున్నారు ప్రసాద్, సోమశేఖర్ మాట్లాడుతూ  రాయవరం మండలం లో ఉన్న పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు ఇక్కడ నుండి రాయవరం మండలం లో పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటే ఉంటుందని నిర్ధారించారు ఈ కార్యక్రమంలో ఐ. ప్రభుదాస్, బక్కీ ప్రాన్సిస్, వైరాల పోతాను బాబు, విలియం కేరి తదితరులు పాల్గొన్నారు.


రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన పొలాలు


 


తాళ్ళపూడి,  పెన్ పవర్:


బుధవారం నాడు భారీ వర్షం కురిచిన కారణంగా పంట పొలాల్లో వర్షపునీరు పొలాలను ముంచింది. వరి వూడ్పులు ఈ మధ్యనే జరిగాయని, దీనివలన చిన్న వరి నాట్లు ఈ వర్షపు నీరుతో మునిగిపోవుట వలన వరినాట్లు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాళ్ళపూడి మండల గ్రామాలు అయిన తాళ్ళపూడి, వేగేశ్వరపురం, బయ్యారం, బల్లిపాడు, తిరుగుడుమెట్టలలో బుధవారం కురిసిన వర్షానికి పంట పొలాలు నీట మునిగాయని తాళ్ళపూడి మండల అగ్రికల్చర్ అధికారి జి.మోహనరావు తెలిపారు. ఆయన తమ సిబ్బందితో నీట మునిగిన పొలాలను పర్యవేక్షించారు. రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాళ్ళపూడి మండలంలో ఎ.ఒ. జి.మోహనరావు విధి నిర్వహణ సక్రమంగా అమలు చేస్తున్నారు అని రైతులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎ.ఎ. లు ఆనంద్, ఈశ్వర్, శ్యామ్ పాల్గొన్నారు


సర్వే ఉద్యోగ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవం.


సర్వే ఉద్యోగ సంఘం 54వ ఆవిర్భావ దినోత్సవం.


గోకవరం పెన్ పవర్.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  సర్వే ఉద్యోగల సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  సంఘం స్థాపకులు స్వర్గీయ పట్టాభిరామయ్య కు జోహార్లు తెలియజేస్తూ మరియు  11158 గ్రామ సర్వేయర్ పోస్ట్ లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ గోకవరం మండలం తాసిల్దార్ వారి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పోసి బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, మండల సర్వేయిర్ మరియు గ్రామ సర్వేయిర్ పాల్గొన్నారు.


10 లీటర్ల నాటు సారాయి  స్వాధీనం  ఒ వ్యక్తి   అరెస్ట్.           


10 లీటర్ల నాటు సారాయి  స్వాధీనం 



800 లీటర్ల పులసిన బెల్లపు ఊట ధ్వంసం        


                             
ఒక వ్యక్తి   అరెస్ట్.           



జగ్గంపేట,  పెన్ పవర్ :


 


పెద్దాపురం  స్పెషల్  ఎన్ ఫోర్స్ మెంట్  బ్యూరో టీమ్ లు  దాడులు  నిర్వహించగా రంగం పేట మండలం  వెంకటాపురం  గ్రామ పరిధిలో    దుళ్ళ లాజరు అను వ్యక్తి  ని 10  లీటర్ల సారాయి తో పట్టుకుని అరెస్ట్ చేశారు. పెద్దాపురం  మండలం   పులిమేరు  గ్రామ పరిధిలో  సారాయి తయారీ కు నిల్వుంచిన   800 లీటర్ల  పులసిన బెల్లపు ఊట ను  కనుగొని, కేసు  నమోదు చేసి  బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సి ఐ. ఎం. రామ కృష్ణ దాస్ తెలిపారు.ఈదాడుల్లో పెద్దాపురంఎక్సైజ్   ఎస్ ఐ. లు    జె.విజయకుమార్ ,కె.తాతారెడ్డి తదితర సిబ్బంది   పాల్గొన్నా రు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...