Followers

అంబేద్కర్ రాజ గృహంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలి


అంబేద్కర్ రాజ గృహంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలి


 


జగ్గంపేట 


 


జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలతో ఆయనను సత్కరించి దళిత ప్రజ చైతన్యం అధ్యక్షులు వల్లూరి సత్యనంధం అధ్యక్షతన అక్కడ నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ముంబైలో ని దాదార్ లో అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పిట్టానాగమణి మాట్లాడుతూ  ప్రపంచ మేధావి  అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ గృహంపై వారు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచానికి వెలుగు చూపిన మహానుభావుడు ఆయన మన దేశానికి మహత్తరమైన ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు ఆయన ఆ ఇంటిలో ఎన్నో విలువైన పుస్తకాలు ఉన్నవి వాటిని ఎంతోమంది వెళ్లి ప్రతిరోజు చదువుకుంటున్నారు అటువంటి గొప్ప రాజగృహం పై ఇటువంటి దాడులు చేయడం చాలా దురదృష్టకరం అని అన్నారు ఆయన ఒక కులానికి కాదు అన్ని కులాలకు సంబంధించినటువంటి మహనీయుడు ఆయన రాసిన టువంటి గ్రంథాలను ఎప్పటికీ కూడా అనేకమంది చదువుతూ తెలియని విషయాలు   తెలుసుకుంటున్నారుఅని అన్నారు. ఎం ఆర్ పీ ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ డి వెంటకరమణ మాట్లాడుతు ఎవరైతే దాడి చేశారు వారిని సిబిఐ ఎంక్వైరీ చేసి వారిని కఠినముగా శిక్షించాలి అని శిక్ష పడే అంతవరకూ మా దళిత సంఘాలు పోరాడుతూనే ఉంటాయని అన్నారు  బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతు వారు క్షమించరాని  పనిచేశారని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పూల మొక్కలను గాని ధ్వంసం చేసి నారు వీరు ఎనకాల ఎవరో ఉండి ఇదంతా చేయించారని వారిని కూడా పట్టుకుని  శిక్ష విధించాలని అన్నారు .ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా నే చూస్తూ ఉన్నారు కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా దళితులపై జరిగిన ఇటువంటి దాడులను ఖండిస్తూ ఈ ప్రభుత్వాలు వారికి కఠిన శిక్షలు విధించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎం డేవిడ్ రాజు చిట్టితల్లి విష్ణ జోషఫ్ పి రవికుమార్ అప్పారావు ఐ రాజ్ కుమార్ దితరులు పాల్గొన్నారు


రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని


 



రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని


 


 


    ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరశక్తి


    ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు రేవా ప్రాజెక్టు నుంచి విద్యుత్


    నిర్మాణం జరుపుకుంటున్న మరికొన్ని ప్రాజెక్టులు



మధ్యప్రదేశ్‌లోని రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 22 డిసెంబర్ 2017 న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టుకు పునాది వేసింది. ప్రాజెక్టు ప్రారంభం సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ఆసియాలో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి పరిశుభ్రమైన వాతావరణానికి పునాది అని అన్నారు. రేవాలో ఏర్పాటు చేసిన పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైడ్ సోలార్ ప్లాంట్లలో ఒకటి. ఈ సౌర విద్యుత్ ప్లాంట్‌లో మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం రాష్ట్ర విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీమెట్రోకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ , ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, ఎంపిలు, సహా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.


ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


చింతపల్లి ,  పెన్ పవర్


పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని ఏజెన్సీ మండల కేంద్రాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, చిన్న పిల్లలకు ఆధార్ నమోదు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న నర్సీపట్నం ఆధార్ సెంటర్ కి వెళ్ళవలసి వస్తుందని, అక్కడ ఆధార్ సెంటర్ ఖాళీ లేకపోతే మరుసటి రోజు వెళ్లడమో లేకుంటే నర్సీపట్నం నకు మరికొంత దూరంలోనున్న రోలుగుంట మండల కేంద్రానికి వెళ్ళడమో చేయవలసి వస్తుందని ఆయా మండలాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తమ మండలాల పరిధిలో ఉన్న ఆధార్ సెంటర్ లకు వెళ్లడానికే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారమని,ఇప్పుడు సొంత మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆర్థికభారం,శ్రమ అయినప్పటికీ నర్సీపట్నం లేదా రోలుగుంట ఆధార్ సెంటర్ కి వెళ్లక తప్పలేదంటున్నారు. వ్యవసాయ, కూలి పనులు మానుకొని వెళ్ళవలసి వస్తుందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు


బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో   రోజువారీ కూలీలకు మాస్కులు పంపిణీ


బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో  
రోజువారీ కూలీలకు మాస్కులు పంపిణీ


 


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు,  ఈ సందర్భంగా  బోచ్చా రామి రెడ్డి మాట్లాడుతూ వార్డులో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండడం వలన, రోజు వారి కూలీలుగా పనిచేస్తున్న వారికి, మాస్కూలూ పంచి,  సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కూలు తప్పకుండా వాడాలని తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమములో మున్నం బాలాజీ, నాయన నాగభూషణం, నాయన వెంకట్రావు, అలుపన శ్రీనివాస్ రెడ్డి, బోచ్చ శంకర్  తదితరులు పాల్గొన్నారు.


నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులు జరిపిన పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను .


నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులు జరిపిన పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను .


పోలవరం పెన్ పవర్



పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట గ్రామంలో గురువారం రాత్రి 8 గంటల  సమయంలో నాటుసారా విక్రయ కేంద్రాలపై పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాటుసారా విక్రయిస్తున్న ఆసుబోయిన యేసు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను తెలిపారు. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ ఆర్ శ్రీను కోరారు. ఈ దాడుల్లో పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను, స్టేషన్ సిబ్బంది మోహన్ రావు, దుర్గాప్రసాద్ , బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 


పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు  పట్టణ పోలీసులు



పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు 


పట్టణ పోలీసులు



పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో


పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు పట్టణ పోలీసులు, గంజాయి నీ సరఫరాను చేస్తున్న మూలాలను కనుగొనీ ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన పాలకొల్లు పోలీసులకు జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  పాలకొల్లు పట్టణ పోలీసు వారిని అభినందించారు


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి  కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్  యొక్క ఆదేశాలపై పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు, పాలకొల్లులో భారీ స్దాయిలో 435 కేజీ లు గంజాయి, డస్టర్ కారు ను స్వాధీనము చేసుకున్నరు పశ్చిమ గోదావరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.ఎన్.నారాయణ్, ఐ.పి.యస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్ వారి ఆదేశాల ప్రకారం. ఈమధ్య భారీ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్  వర్క్ ను చేపడుతున్న  పోలీస్ లకు నిన్న రాత్రి నరసాపురం సబ్ డివిసన్ లో పాలకొల్లు టౌన్ శివారులోని స్వప్నబార్ దగ్గర పోలీస్ లు నిర్వహించిన  ఆకస్మిక వాహన తనిఖీలో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి డస్టర్   కార్ లో తరలిస్తున్న  సుమారు 435 కె.జి ల గంజాయిని,   ఆ కార్ పోలీస్ లకు చిక్కకుండా బైక్ పై ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీస్ లు పట్టుకోవడం జరిగింది, ఈరైడ్ లో 21,75,000/- విలువ కలిగిన గంజాయి, ఒక డస్టర్  కార్, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు, పోలీస్ లు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అని నరసాపురం డి.ఎస్.పి నాగేశ్వరరావు  ప్రెస్ మీట్ లో  వివరాలు వెల్లడించారు. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయిని అమ్ముతున్న మిగిలిన ముద్దాయిల కోసం పోలీస్ లు గాలింపుచర్యలు చేపట్టారు.  ఈ రైడ్ లో పాల్గొన్న పాలకొల్లు టౌన్ సి.ఐ. సిహెచ్. ఆంజనేయులు , ఎస్ఐ అయిన ఎఫ్. రహమాన్, జె.వి. ఎన్ ప్రసాద్ , మరియు వారి సిబ్బందిని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి . . యస్. ఈ.బి  అదనపు ఎస్పీ  సిబ్బందిని అభినందించారు.


చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనిత రోడ్ శంఖుస్థాపన


చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనిత రోడ్ శంఖుస్థాపన



తాళ్ళపూడి,  పెన్ పవర్:



చాగల్లు మండలంలో మార్టేరు టూ ప్రక్కిలంక రహదారి అని పిలువబడే రోడ్ కు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శంఖుస్థాపన శుక్రవారం చేశారు. ఈ రోడ్ కు దాదాపు 24 కోట్ల   రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు. ఈ రోడ్ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ మినిస్టర్   కృష్ణ దాస్ కి,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి, వనిత ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ చాలా పాడైపోయింది అని, ఈ రోడ్ మీద నుంచి నడవడానికి పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.  నేను ఎక్కువగా ఈ రోడ్ మీద నుండే ప్రయాణం చేస్తుంటానని, ప్రయాణికులు ఇబ్బందులు చూస్తూ ఉంటానని వనిత చెప్పారు.రైతులు వ్యవసాయo కొరకు దమ్ముకు ఉపయోగించే ట్రాక్టర్ వీల్స్  ఈ రోడ్ గుండా తీసుకెళ్లితే దాని వలన రోడ్ పాడవుతుంది అని, ఇది గవర్నమెంట్ ది అనుకోవడం సరికాదని, గవర్నమెంట్ అంటే మనమేనని, మనం కట్టిన పన్నులు అభివృద్ధి కార్యక్రమాలుకు ఖర్చుచేస్తారని, ఈ రోడ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమందరికి ఉందని తెలిపారు. కరోన విజృoబిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు తుంపరలు ఎదుటి వ్యక్తులు మీద పడతాయని, ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు, దీని వలన ఎదుటివారి కి అటాక్ అవ్వొచ్చని తెలిపారు. అందరూ కరోన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...