Followers

ఉచిత బియ్యం క్యూలో  వడదెబ్బ తగిలి వృద్ధురాలు మృతి.


 


 






         పెన్ పవర్ ..చోడవరం. 

 

ప్రభుత్వం   పంపిణీ చేస్తున్న  ఉచిత బియ్యం   కోసం  క్యూలో నిలబడి  ఒక వృద్ధురాలు  ప్రాణాలు కోల్పోయిన  సంఘటన . చోడవరం  పట్టణంలో  చోటు చేసుకుంది.  సోమవారం పట్టణాల్లోని  ద్వారకా నగర్ లొ ఉంటున్న   షేక్‌ మేరబీ (65)  రేషన్  షాపు2కు   ఉచిత బియ్యం కోసం  వెళ్ళింది కరోనా లాక్ డౌన్   కారణంగా  ప్రభుత్వం విధించిన  నిబంధనల ప్రకారం  సామాజిక దూరం  పాటించాలని  చెప్పడంతో  ఆమె  క్యూలైన్లో  నిల్చుంది. ఎండ ప్రభావానికి  వడ దెబ్బ తగలడంతో  నిలుచున్న చోటే పడిపోయింది. పరిస్థితి గమనించిన స్థానికులు ఇంటికి తరలించే లోపే మేర్బి  ప్రాణాలు కోల్పోయింది.కరోనా  వైరస్‌ కు   గురి కాకుండా  ప్రజలు  సామాజిక దూరం  పాటించాలని  చేసిన సూచన  వృద్ధురాలి ప్రాణం పైకి వచ్చింది. రేషన్ డిపోల పరిధిలో  ఖాళీ ప్రదేశాల్లో లేకపోవడంతో  రోడ్లపైకి  క్యూలైన్లు  కడుతున్నారు. ఎండ తీవ్రత  తట్టుకోలేక  వృద్ధులు  తల్లడిల్లుతున్నారు.




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...