Followers

ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ:


ఎంవీపీలో నిరుపేదలకు ఆహారం, పండ్లు పంపీణీ: బిజెపి నాయకురాలు డి. అరుణ కుమారి

 

ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ 

.

 

కరోనా మహమ్మారి  ప్రపంచం మీద విరుచుకుపడుతోంది,  లాక్ డౌన్ పేరిట అందరూ ఇళ్లకే పరిమితమైన  పరిస్థితి నెలకొంది. కూలాడితే కుండాడని పరిస్థితిలో ఉన్నవాళ్ల పరిస్థితి మరీ దయనీయం, ఏపూట కాపూట సంపాదనతో కడుపునింపుకునే వాళ్లవి మరీ దుర్భర పరిస్థితి, చేసేందుకు పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక బాధ పడేవారికి ఆపన్న హస్తం అందించేందుకు నేను సైతం అంటూ ముందుకొచ్చారు విశాఖపట్నం బీజేపీ నాయకులు ద్వారపూడి అరుణ కుమారి, ఎం.వీ.పీ కాలనీ ఫుడ్ పాత్  రోడ్ల ప్రక్కన నివసిస్తున్న అనాధాలకు ఆహరం పండ్లు మజ్జిగ   పంచిపెట్టి తన ఉదారతను చాటుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమెను పలకరించిన '' పెన్ పవర్ " కు  అరుణ కుమారి చెప్పిన సమాధానం  ఆమె మాటల్లోనే...  ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాటివారికి సాయపడటంలో ఉన్న ఆనందం మనల్ని మనుషులుగా మరో మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహమే లేదు. మన ఆస్థుల్ని పంచిపెట్టాల్సిన పనిలేదు, మనకున్నదాంట్లో  వేరొకరి ఆకలి తీర్చగలిగితే అంతకు మించిన ఆనందంగా 

వర్ణనాతీతం అన్నారు  ఆమె.

ఈ కార్యక్రమంలోఅరుణ కుమారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...