Followers

వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు


 


 


విశాఖపట్నం, పెన్ పవర్ 


 లాక్ డౌన్ వలన జివిఎంసి పరిధిలో నిలిచిపోయిన ఇతర రాష్ట్రాల, ఇతర జిల్లాల నుండి వచ్చిన వలస జనానికి తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు విశాఖపట్నం, మార్చి 29 :- కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో భాగంగా ఏప్రిల్ 14 వతేది వరకు ప్రభుత్వమ లా డౌన్ ప్రకటించినందున, ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వచ్చిన వలసదారులు, రోడ్డు మార్గంలో చిక్కుకుపోయిన వాహన కార్మికులు మరియు బిచ్చగాళ్ళ గూర్చి తాత్కాలిక ఆశ్రయ శాలలు ఏర్పాటు చేయవలసినదిగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జివిఎంసి కమిషనర్ వారు ఆదేశానుసారం, నగర పోలీసు వారి సహకారంతో కార్పోరేషను పరిధిలో 5 ప్రాంతాలలో తాత్కాలిక షెల్టరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలలో జివిఎంసి తరుపున నివాసానికి అనువుగా అవసరమైన బెడ్స్, దుప్పట్లు, మంచినీటి సదుపాయాలు, మరుగుదొడ్లు, స్నానగదులు ఏర్పాట్లు, విద్యుత్ సదుపాయం, ఆహారం మొదలగు సదుపాయాలు కేంద్రాలలో ఉన్న ఆశ్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించవలసినదిగా జివిఎంసిలోని ఆయా విభాగాల ఇంజనీరింగు, ప్రజారోగ్యశాఖ, యుసిడి విభాగపు ఉన్నతాధికారులకు, కమిషనరు ఆదేశాలు జారీచేశారు. 5 కేంద్రాలలో కూడా 24 గంటలు నిరంతరంగా పర్యవేక్షించేందుకు, రెండు షిప్టులలో ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు ఒక షిప్టు, సాయంత్రం 6.00 గంటల నుండి ఉదయం 6.00 వరకు రెండవ షిప్టులో పనిచేసేటట్లుగా ప్రత్యేక అధికారులను సిబ్బందిని నియమించారు. ఆశీలుమెట్ట వేమన మందిరం షెల్టరుకు ప్రత్యేక అధికారులుగా ఎ.వి.రమణారావు డిఎంసి, 9912349438 (షిఫు-ఎ), శ్రీమతి పి.వి.లక్ష్మి టి.ఇ, 7901610057 (షిప్టు-బి) సుబ్బలక్ష్మీ కళ్యాణ మండపం, న్యూకాలనీ, కె. పైడితల్లి ఎపిడి 8179288053 (షిప్టు -ఎ) పి.రమ్యకృష్ణ టి.ఇ 7729878881(షిఫ్టు-బి), వివేకానంద కళ్యాణ మండపం, నక్కవానిపాలెం జి.కుమారస్వామి డిఎమ్ సి 9848055179 (షిప్టు-ఎ), ఆర్.రమేష్, డిఎమ్ సి 9666683949(షిఫ్టు-బి), సాంఘిక సంక్షేమ హాస్టల్, ఎం.వి. కాలనీకి పుణ్యవతి, సోషల్ వర్కర్ 7729995961(షిఫ్ట -ఎ), కె.పద్మావతి సోషల్ వర్కర్ 7729995963(షిపు-బి) యూత్ ట్రయినింగ్ కేంద్రం, వేపగుంటకు బి.ప్రసాదరావు ఎపిడి 9848308835(షిప్టు-ఎ) వై.సంతోష్ కుమార్, సోషల్ వర్కర్ 7729995938 (షిప్టు-బి) లను ప్రత్యేకాధికారులుగా నియమించారు. షెల్టర్ల నోడల్ అధికారిగా పి.డి., యుసిడి వై.శ్రీనివాసరావును అత్యవసర పనులు నిమిత్తం కమిషనరు నియమించారు. లా డౌన్లో చిక్కుకున్న వలసదారులు, వాహనాల కార్మికులు మొదలగువారు ఆయా కేంద్రాలను ఉ పయోగించుకోవలసినదిగా గ్రూపు సముహాలుగా బయట తిరగకుండా లాక్ డౌన్ విధానంలో జీవనం గడపాలని, దీనివలన కరోనా వైరస్ వ్యాప్తి జరుగుకుండా ఉండేందుకు దోహదపడతారని, కమిషనరు వారు కోరారు. నగర పరిధిలో ఆశక్తి కలిగిన వ్యాపార సంస్థలుగాని, కాంట్రాక్టర్లుగాని, స్వచ్ఛంద సంస్థలుగాని, ధార్మిక సంస్థలువారు గాని ఈ కేంద్రాలలో ఫలహారం, భోజనసదుపాయలు ఏర్పాటు చేయదలచుకున్నచో జివిఎంసి యుసిడి ప్రాజెక్టు డైరక్టరు శ్రీనివాసరావును సంప్రదించవలసినదిగా ఆయన పత్రికా ప్రకటనలో కోరారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...