Followers

తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 


తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ 

 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

తెలుగుదేశం పార్టీ  పేదల పార్టీ అని  ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ లు పేర్కొన్నారు. పార్టీ 37 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.  పరమేశ్వరి పార్క్ జంక్షన్ లో ఎన్టీఆర్ విగ్రహంకు  పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  జోహార్  ఎన్టీఆర్ అనే నినాదాలతో పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మాభిమానాని ఢిల్లీలో చాటి చెప్పిన ఘనుడు ఎన్టీఆర్  అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ తెదేపా నాయకులు  కొణతాల వెంకట్రావు ,మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...