నేకూరి రాజేష్ సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
రాజేష్ ఆధ్వర్యంలో 300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ
రావులపాలెం, పెన్ పవర్: కోణాల వెంకట రావు
ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని నిరూపిస్తూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ దృష్ట్యా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందించేందుకు పలువురు దాతలు, సంస్థలు స్వచ్చందంగా ముందుకు వచ్చి సహాయపడడం అభినందనీయమని స్థానిక శాసనసభ్యులు ,రాష్ట్ర పియుసి చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర వస్తువులు దొరకక పడుతున్న ఇబ్బందులు గుర్తించిన రావులపాలెం గ్రామానికి చెందిన నేకూరి రాజేష్, ఆయన కుటుంబ సభ్యులు దొండపాటి పనసయ్య,దొండపాటి వీర్రాజు లు తమ దాతృత్వం చాటరు. శుక్రవారం రావులపాలెం గ్రామంలోని సుమారు మూడు వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు రాజేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు అందజేయడం అభినందనీయమన్నారు. నేకూరి రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి తమ వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పంచారు.ఈ కార్యక్రమంలో గొలుగూరి మునిరెడ్డి, సాకా ప్రసన్న కుమార్,కోట చెల్లయ్య,పడాల పరమేశ్వర రెడ్డి,పడాల వెంకట రెడ్డి, కప్పల వరప్రసాద్, మాకా రాజేంద్రన్ , యార్లగడ్డ జగజ్జీవన్ రావు, నేకూరి మల్లేశ్వరరావు, వంగలపూడి బాబూరావు, యార్లగడ్డ భాస్కర రావు, యార్లగడ్డ చిట్టిబాబు, గెల్లారాజు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment