- ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
కోరుకొండ, పెన్ పవర్ : మనోజ్ మెహతా
రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా శుక్రవారం బూరుగుపూడి గ్రామంలో ప్రతి కుటుంబానికి పోషకాహారమైన గుడ్లును పంపిణీ చేశారు. సుమారు పదిహేను వందల కుటుంబాలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపుమేరకు బూరుగుపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రొవ్విడి సర్రాజు, కంటె వినయ్ తేజ, కంటే సత్తిబాబు, పిట్టా కృష్ణ పలువురు నేతలు సమకూర్చిన గుడ్లను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఇంటికి సొంతమైన అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు భోజన ప్యాకెట్లు, కూరగాయల ప్యాకెట్లు మాస్కులు హెల్త్ కిట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత పాటించి, ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు.
No comments:
Post a Comment