Followers

కార్మికులకు 10వేలు ఆర్ధిక సహాయం అందించాలి.





కార్మికులకు 10వేలు ఆర్ధిక సహాయం అందించాలి.

 

8 గంటల‌ పనిదినాన్ని అమలు చేయాలి

 

సిపిఎం సీనియర్‌ నాయకులు అజశర్మ 

 

     స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్) 

 

 

కరోనా నిర్మూలనలో భాగంగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో అసంఘటితరంగ కార్మికుల‌కు 10వేలు ఆర్ధిక సహాయం అందించాల‌ని, 8 గంటల‌ పనిదినాన్ని అమలు చేయాల‌ని సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.అజశర్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ను డిమాండ్‌ చేసారు.శుుక్రవారం  మేడే సందర్భంగా మద్దిపాలెం సిపిఎం కార్యాయం వద్ద జెండావిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా  పెట్టుబడిదారీ సమాజం శ్రామికవర్గాన్ని దోపిడీ చేసి తమలాభాల‌ సంపాదించుకోవాల‌ని చూస్తున్నాయన్నారు. నేడు ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనా మహమ్మారి అగ్ర‌దేశాల‌ను సైతం వదటం లేదన్నారు. ఈ వైరస్‌ కారణంగా శ్రామికవర్గం ఆర్ధికంగా చితికిపోయిందన్నారు. కార్మికవర్గాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్టుబడిదారుల లాభాల‌కోసం 8 గంటల‌ పనిదినాన్ని 12 గంటల‌కు మార్చడాన్ని తప్పుపట్టారు. మరోవైపు అసంఘటితరంగంలో పనిచేసే కార్మికుల‌కు ఆదాయాల్లేక‌ పస్తులుంటే వారికి ఆర్ధిక సహాయం చేయకుండా పెట్టుబడిదారుల‌కు 62వేల‌ కోట్లు రుణమాఫీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సోషలిస్టు దేశాల‌న్నీ కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్నా‌య‌న్నా‌రు. రాబోయేకాలంలో ఉపాధి , కార్మిక హక్కుల‌ రక్షణకోసం పోరాటాలు ఉధృతం చేయాల్సి వస్తుందన్నారు. మద్దిపాలెం జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.గంగారావు, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పి.మణి, అప్పారావు, చల‌పతి, రమణారావు, కుమారి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...