Followers

వైసీపీ నాయకుల ఆద్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ


 


పూర్ణా మార్కెట్, పెన్ పవర్


 


గోకుల్ థియేటర్ నుంచి చావుల మదుం రోడ్ లో ఉన్న పాత శివాలయం వద్ద హోటల్ ఎస్ ఎస్ జి రెసిడెన్సి అధినేత గోగుల.రామారావు, పవన్ హెచరీస్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ ల ఆర్థిక సహాయంతో "కరోనా లోక్ డౌన్ "....వలన ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఈ ప్రాంత వాసులకు కు 500 మందికి సుమారు వెయ్యి రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు  మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం వి వి సత్యనారాయణ , వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ , వైయస్సార్సీపి నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ , పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజుల సమక్షంలో పేదలకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తూ వారి వారి కుటుంబాలను కాపాడుకోవాలని ప్రజలకు తెలియజేశారు, పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్  ఈ కార్యక్రమం నిర్వహించిన సంస్థలను ఇటువంటి సమయంలో వారు ఉదార స్వభావం తో ఇటువంటి మంచి కార్యక్రమాలు తలపెట్టడం ఎంతో అభినందనీయం అని వారిని ప్రశంసించారు,
ఈ కార్యక్రమంలో ఈ యొక్క సంస్థల డైరెక్టర్లు దాసరి రాధాకృష్ణ, వేచాలపు దొరబాబు, బిక్కిన శ్రీనివాస్, రొంగలిసూర్యనారాయణ, లెక్కల నాయుడు, మకర గోపి, గంట శ్రీను మరియు ఆయా సంస్థల యొక్క సహాయక బృంద సభ్యులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...