Followers

వీరశివాజీకి నివాళులు..


దేశభక్తి, సురక్ష, సుపరిపాలన అందించి వీరశాలిగా నిలిచిన మహా చక్రవర్తి శివాజీ..

రంగారెడ్డి నగర్ డివిజన్ లో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్



కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,127 రంగారెడ్డి డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కాలని వాసులు ఏర్పాటు చేసిన వేడుకలో శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మరియు కార్పోరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మరణించి వందల ఏళ్లు గడుస్తున్నప్పటికి ఆయన అమరుడిగా నిలిచిపోయారన్నారు. ఆయన దేశభక్తి, సురక్ష, సుపరిపాలన అందించి వీరశాలిగా నిలిచారన్నారు. శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ధైర్యం, పట్టుదల, దైవభక్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్, భౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, మాజీ జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వార్డు సభ్యుడు రహీం, కాలనీ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, కార్తిక్ గౌడ్, సుధాకర్, వెంకటేశం, హరికృష్ణ, వెంకటేష్, వీరయ్య, అబ్రహం, గణేష్, మల్లేష్, శ్రీదర్, బాను, కృష్ణ, రాంబాబు, షకీల్, టిల్లు, అఫ్ఫు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...