చేయూత ద్వారా రూ 55 వేలు ఆర్థిక సాయం
పెన్ పవర్, కరప
కరప మండలం గురజానపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు కోన సాయికుమార్ వైద్యానికి చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ రూ 55,555 లు ఆర్ధిక సాయమందించారు. డ్రైవర్ గా పనిచేస్తున్న సాయికుమార్ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు ఎం.రవికుమార్, ప్రధాన కార్యదర్శి ఎంఎ అలీమ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు చింతా నారాయణమూర్తి, భాషా, విజయ్ లు తమ సంస్థ సభ్యులతో చర్చించి, విరాళాలు సేకరించారు. మంగళవారం గ్రామ సర్పంచ్ అనసూరి శ్రీనివాసరావు తదితర గ్రామస్తులతో కల్సి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందజేశారు.

No comments:
Post a Comment