Followers

కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

 కన్నెపల్లి లోని దాంపూర్ లో వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

కన్నెపల్లి, పెన్ పవర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని దాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు ఓ రైతు ప్రాణాలు గాల్లో కలిసాయి.కుటుంబసభ్యులు,పోలీసులు సమాచారం ప్రకారం బుధవారం రాత్రి గ్రామానికి చెందిన రైతులు మేకల శంకర్, నారాయణ ఇద్దరూ కలిసి కట్టెలు అమ్మడానికి ఎడ్లబండిలో విగాం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు దారి తప్పడంతో,ఎడ్ల బండి దిగి దారి వెతుకుతుండగా పత్తి చేను వద్ద వేటగాళ్ళు అమర్చిన కరెంట్ తీగలకు తగిలి శంకర్  అక్కడికక్కడే మృతి చెందాడు.వెంటనే తేరుకున్న నారాయణ గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు సమాచారం అందించాడు. తాండూరు సీఐ బాబూరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అనంతరం శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉచ్చు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...