పల్లె ప్రకృతి వనాలను పరిశీలించిన మహుబూబాబాద్ డి పి ఓ.
నెల్లికుదురు, పెన్ పవర్
మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి, మొదనతూర్తి,రాత్తిరాంతండా, చిన్ననాగారం గ్రామాలలోని పల్లె ప్రకృతివనాలను, స్మశానవాటికల ను మహుబూబాద్ జిల్లా డి పి ఓ రఘవరణ్ ఎం పి ఓ పార్టసారధితో కలిసి పర్యటించారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతు గ్రామాలలో నిర్మిస్తున్న స్మశానవాటికలను త్వరగా పూర్తిచేయాలని మరియు గ్రామంలోని ప్రతివాడనుచెత్త లేకుండా పరిశుభ్రతతో ఉంచాలని అన్నారు. అంతేగాక ఇంటిపన్ను నల్లా పన్నులనుఈనెల చివరి వరకు వందశాతం వసూలు చేయాలనీ తెలిపారు. శ్రీరామగిరిలోనిర్మిస్తున్న హెల్త్ సెంటర్ నాణ్యతలోపం ఉన్నదని గ్రామస్టులు ఆయనకు పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు వార్డుమెంబర్లు పాల్గొన్నారు.


No comments:
Post a Comment