ఫీల్డ్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించండి
పెన్ పవర్, రావులపాలెం
ఒ ఎన్ జి సి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణ పై యాజమాన్యం తక్షణం సరైన నిర్ణయం తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ స్టేట్ చైర్మన్ వై సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ బుధవారం ఒక ప్రకటన వెలువడించారు. ఇప్పటికే ఫీల్డ్ ఆపరేటర్ల ఉద్యోగ భద్రత విషయంలో మేనేజ్ మెంట్ తో పలు దఫాలుగా చర్చలు జరపినా ఆ చర్చలు కొలిక్కి రాకపోవడంతో సమ్మెకు దిగాల్సివచ్చిందన్నారు. ఆపరేటర్ల వేతన సవరణ జరగక పోవడం వల్ల మానసిక క్షోభకు గురవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల కాలంగా వేతన సవరణ విషయంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం సరైనది కాదని ఆయన దుయ్యబట్టారు.ఇప్పటికే అనేకమంది ఫీల్డ్ ఆపరేటర్లు ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురై పదవీ విరమణ చేయటం జరిగిందన్నారు. తక్షణం యాజమాన్యం ఫీల్డ్ ఆపరేటర్లు ఉద్యోగ భద్రత విషయంలో చర్యలు చేపట్టాలని కోరారు.
No comments:
Post a Comment