Followers

తెలంగాణ ప్రజల మేలు కోరి చాదర్ ను అజ్మీర్ కు పంపిన టిఆర్ఎస్ నాయకులు..

 తెలంగాణ ప్రజల మేలు కోరి చాదర్ ను అజ్మీర్ కు పంపిన టిఆర్ఎస్ నాయకులు..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్



తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ టిఆర్ఎస్ నాయకులు వారాల వినోద్..మాజీ కార్పోరేటర్ సురేష్ రెడ్డి తమ టిఆర్ఎస్ నాయకుడు వాలిభాయ్ రాజస్తాన్ లోని అజ్మీర్ కు కుటుంబ సమేతంగా వెల్తున్న సందర్బంగా.. ప్రత్యేకంగా చాదర్ ను పంపించారు..  రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ గ్రామంలో వెలసిన "ఖాజా గరీబ్ నవాజ్" సుమారు ఎనిమిది వందల యేండ్ల క్రితం మహ్మద్ వక్త సూచన మేరకు ఖాజా గరీబ్ నవాజ్.. సౌదీ అరేబియా మక్కానుండి, భారత దేశంలోని రాస్థాన్ అజ్మీర్ వచ్చి స్థిరపడ్డారు..అప్పట్లో అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి అజ్మీర్ గ్రాంమలో స్థిరపడ్డట్టుగా ముస్లీం అనుభవజ్ఞులు చెపుతున్న వివరాలు... ముస్లింలకు ఆచార కట్టుబాట్లు నేర్పిన "ఖాజా గరీబ్ నవాజ్" ముస్లీం కుటుంబంలో..ఏవిదంగా ఉండాలి అనే విషయా నేర్పించిన వ్యక్తి ఖాజా గరీబ్ నవాజ్ అని మంచిమార్గాన్ని చూపించిన వ్యక్తే ఖాజా గరీబ్ నవాజ్ దేవునిగా పవిత్రమైన స్థలంగా ముస్లీంలు కొలుస్తారని.. టిఆర్ఎస్ నాయకులు వారాల వినోద్, సురేష్ రెడ్డి తెలియ జేశారు.. అలాంటి పవిత్రమైన అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ 809వ ఉర్సు ఉత్సవాలను ఈమద్యనే జరుపుకున్నారని.. అంత పవిత్రమైన స్థలానికి తాము చేరుకోలేక పోయినా ఆపవిత్ర స్థలానికి వెళ్లే వారితో, తెలంగాణ ప్రజల యోగక్షేమాలకోసం అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ కు చాదర్ పంపించడం ఎంతో మనశ్శాంతిగా ఉందని వారాల వినోద్ తెలుపారు.. అజ్మీర్ కు వెళ్ళేవారిలో మహ్మద్ వాలీ, సమీర్, సల్మాన్, యూనస్, వాకిల్, ఆశు, షాబుద్దీన్, దస్తగిరి, గౌస్, యాకూబ్ ఖాజా గరీబ్ నవాజ్ ను దర్శించుకొనుటకు వెళ్లారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...