Followers

రామనాదరెడ్డికి సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి

 రామనాదరెడ్డికి సిపిఐ ఆధ్వర్యంలో ఘన నివాళి

 చిత్తూరు, పెన్ పవర్

కామ్రేడ్ రామనాధ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన చిత్తూరు సిపిఐ నాయకులు. రామనాధ రెడ్డిగారికి  ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మొదటితరం నాయకులలో రామనాధ రెడ్డి ఒకరు అన్నారు విద్యార్దుల ఉద్యమంలో  ప్రవేశించిన రామనాదరెడ్డి కార్యకర్తగా ఉంటూ,విద్యార్ది నాయకులు క్రిష్ణ రెడ్డి , గంధమనేని శివయ్యలతో పరిచయం కావడం క్రమంగా కమ్యూనిష్టు ఉద్యమంలో పనిచేశేవారు . 25 సం:రాలు సర్పంచ్ గా ఉంటూ ఆదర్శవంతంగా సేవ చేసిన ఆదర్శమూర్తి రామనాధ రెడ్డి అని కొనియాడారు. కమ్యూనిష్ట్ ఉద్యమం పై  అంకితబావం తో  పని చేశారు.కోవిడ్ వలన మరణించిన రామనాదరెడ్డి  ఆవేదనతో వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికుటుంబ సబ్యులకు సానుబూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కె.మణి, ఏ.సత్యమూర్తి, దాసరి చంద్ర,  గిడ్డు బాయ్, కె.గంగాధర్ గణపతి, పి.గజేంద్ర బాబు, పి.రఘు,కె.రమాదేవి, కె. విజయ గౌరి, బి.కుమారి, వి.కోమల, మోదీన్, తిరువెంగడం, చాను భాషా, కరీం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...