ట్రాక్టర్ క్రింద పడి మహిళ మృతి
సంతబొమ్మాలి, పెన్ పవర్
ట్రాక్టర్ కిందపడి సాహుకారి కృష్ణవేణి (53) అనే మహిళ మృతి చెందింది. సంతబొమ్మాలి ఎస్ ఐ ఎం గోవింద్, కృష్ణవేణి భర్త చంద్ర భూషణ తెలిపిన వివరాల ప్రకారం పాత మేఘవరం గ్రామానికి చెందిన సాహుకారి చంద్ర భూషణ,తన భార్య కృష్ణ వేణి ఉదయం ఇంటి నుండి బోరుభద్ర ఆరోగ్య కేంద్రం లో కరోనా టీకా వేసికో వడానికి ద్వి చక్ర వాహనం పై వెళుతుండగా కొల్లి పాడు శివాలయం దగ్గర ఉన్న క్రాసింగ్ కు వచ్చేసరికి బోరుభద్ర నుండి మేఘ వరం వైపు వస్తున్న ట్రాక్టర్ నిర్లక్ష్యం గా డ్రైవ్ చేసుకుంటారావడం తో ట్రాక్టర్ వెనుక భాగం కు కృష్ణ వేణి బుజం తగిలి క్రింద పడి పోవడం వలన తలకు బలమైన గాయం కావడంతో కృష్ణ వేణి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన లో చంద్రభూషణ కు ఎటువంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.దీనిపై సంతబొమ్మాళి ఎస్ ఐ ఎం.గోవింద్ సంఘట న స్థలానికి చేరుకొనిశవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటన పై సంతబొమ్మాళి ఎస్. ఐ. ఎం. గోవింద్ ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
No comments:
Post a Comment