Followers

పదోతరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రద్దుచేయాలి

 పదోతరగతి, ఇంటర్మీడియట్ పరిక్షలు రద్దుచేయాలి 

 

 పెన్ పవర్, కందుకూరు

 దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంబిస్తున్న వేళ విధ్యార్థిని , విధ్యార్థుల భవిష్యత్తును ధృష్టిలో పెట్టుకుని దేశంలోని కొన్ని రాష్ట్రాలు  పది , ఇంటర్ పరిక్షలు వాయిదా వేసి పిల్లలకు, ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ప్రకటిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం విధ్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాటడం మంచిపద్దతి కాదని ప్రభుత్వం అవలంబిస్తున్న మొండివైఖరిపై తెలుగుదేశం పార్టీ యస్.సి సెల్ జిల్లా కార్యదర్శి గోచిపాతల. మోషే మండిపడ్డారు. పదోతరగతి , ఇంటర్మీడియట్ పరిక్షలు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలో దాదాపు 80లక్షల మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా విధ్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని  మోషే ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అధికమై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చోధ్యం చూస్తున్నారని మోషే ఆవేదన వ్యక్తంచేశారు. విధ్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పదోతరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని  మేధావులు , ప్రతిపక్షపార్టీలు , వామపక్షాలు , పిల్లల తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు , విధ్యార్థిసంఘాల నాయకులు ప్రభుత్వంపై వత్తిడి పెంచిన మొండిగా వ్యవహారిస్తున్నారని మోషే ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...