కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, నగర పాలిక కమిషనర్
చిత్తూరు, పెన్ పవర్
కోవిడ్ కేర్ కేంద్రంలో అన్ని సౌకర్యాలతో పాటు వారికి మంచి ఆహారం, భోజన వసతిని కల్పించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా), రాజశేఖర్ అన్నారు. చిత్తూరు నగర శివార్లలో ఆర్ వి ఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ఆయన నగర పాలిక కమిషనర్ విశ్వనాథ తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అందుతున్న ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకొన్నారు.
ఎంతమంది బాధితులు ఉన్నారని అందులో ఎంతమందికి ఆక్సిజన్ ఇస్తున్నారని , ఎంతమంది సిబ్బంది వారికి వైద్యసేవలు అందిస్తున్నారని అడిగారు. అదేవిధంగా ట్రయజ్ కేంద్రం నుంచి పంపుతున్నారా లేదా నేరుగా కోవిడ్ కేంద్రానికి వైద్యసహయం కోసం వస్తున్నారా అని సిబ్బందిని అడిగారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు,నగర పాలక కమిషనర్ విశ్వనాథ, నోడల్ అధికారి రాజేంద్రప్రసాద్, డాక్టర్ శ్రీనివాసులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment