Followers

ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

 ఏజెన్సీలో 15 లోగా ఉచిత బియ్యం పంపిణీ చేయాలి

పెన్ పవర్, విశాఖపట్నం

  విశాఖ ఏజెన్సీలో ఈనెల 15లోగా ఉచిత బియ్యం పంపిణీ పూర్తిచేయాలని పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారిణి  లక్ష్మీ శివ జ్యోతి అన్నారు. సోమవారం పాడేరు ఆర్డిఓ కార్యాలయం నుంచి  పాడేరు జి.మాడుగుల  పెదబయలు   ముంచంగిపుట్టు  హుకుంపేట  డుంబ్రిగూడ  అనంతగిరి  అరకు  జీకే వీధి  చింతపల్లి మండలాల తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రెండవ విడత కరోనా మహమ్మారి ఉధృతమవుతున్న దృశ్య ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేపట్టిందన్నారు. గిరిజనులకు 15వ తేదీలోగా ఉచిత బియ్యం అందించాలని కోరారు. క్షేత్ర స్థాయిలో కి బియ్యం వాహనాలు వెళ్లి గ్రామాల్లో గిరిజనులకు ఉచిత బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను కోరారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ లో ఎటువంటి అవకతవకలు జరిగిన  సహించేది లేదని ఆమె హెచ్చరించారు.  ఆయా మండలాల తహసీల్దార్లు  శివారు గ్రామాలకు సైతం ఉచిత బియ్యం అందాలని దీనికోసం  తహసీల్దార్లు తగిన చర్యలు తీసుకోవాలని  ఆర్ డి ఓ లక్ష్మీ శివ జ్యోతి కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...