గోకవరం పెన్ పవర్
భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని గోకవరం మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం భక్తి శ్రద్ధలతో ఏకాహ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని గోకవరం లో గల ఆర్టీసీ కాంప్లెక్స్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లోని కామరాజుపేట లోని వేణుగోపాలస్వామి ఆలయం లోనూ మల్లవరం లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో,గుమ్మల్ల దొడ్డి లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలోనూ, అచ్చుతాపురం లోని పల్లపు వీధిలో గల శ్రీరామ్ ఆలయంలోనూ దేవతామూర్తులకు భజన సమాజాలతో భజనలు అభిషేకాలు స్వామివారి కి కల్యాణాన్ని నిర్వహించారు. రంప యర్రంపాలెం గ్రామ శివారులో గల పాండవుల కొండపైకి గ్రామస్తులు చేరుకునే పాలు పొంగించి కుని సూర్యనమస్కారాలు చేయడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏకాహ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించారు.







