Followers

కాంగ్రెస్ఎస్టీసెల్ నెల్లికుదురు మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్

 కాంగ్రెస్ఎస్టీసెల్  నెల్లికుదురు  మండల అధ్యక్షులుగా భాస్కర్ నాయక్ 

నెల్లికుదురు,పెన్ పవర్

మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్  అధ్యక్ష ప్రధానకార్యదర్శులుగా రత్తిరామ్ తండాకు చెందిన గుగులోత్ భాస్కర్,వస్రం తండాకు చెందిన గుగులోత్ రవిలను నియమించినట్లు డిసిసి అధ్యక్షులుజెన్నారెడ్డి భరత్ చంద్రా  రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ నాయక్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతుల హక్కుల కోసం ఉద్యమిస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి భాస్కర్,రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ మురళి నాయక్,డి సి సి ఉపాధ్యక్షులు ఎద్ఎ దళ్ళయాదవరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్,నాయకులు దల్ సింగ్,గంకిడి ఎల్లారెడ్డి,మట్టవెంకట్ రెడ్డి,లింగ్యానాయక్,వీరన్న నాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

సమస్యలపై పోరాడే ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం.

 సమస్యలపై పోరాడే ప్రేమేందర్ రెడ్డి ని గెలిపించుకుందాం..   బిజెపి జిల్లా నేత సురేందర్ రెడ్డి

నెల్లికుదురు,పెన్ పవర్

ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం అని ఆ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బీరవెల్లి సురేందర్ రెడ్డి పట్టభద్రఓటర్లను అభ్యర్థించారు మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు.మండల కేంద్రo  లో సోమవారంబీజేపీ పార్టీ జిల్లా నేత బీరవెల్లి  సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోరుతూ ఉద్యోగులు నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల ఇళ్లల్లోకి వెళ్లి మొదటి ప్రాధాన్యత ఓటును సమస్యలపై పోరాడి  సాధించే సత్తా కలిగినప్రేమేందర్రెడ్డికేవేయాలనికోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధికార ప్రతినిధి వెలుకూచి నాగయ్య శాస్త్రిపార్టీ సీనియర్ నాయకులు ఆకుల వెంకటేశ్వర్లు ,కిసాన్మోర్చా మండల అధ్యక్షులు కొత్త సమ్మిరెడ్డి,ఓ బి సి మండల అధ్యక్షులు బొమ్మ రాతి నగేష్,తదితరులు పాల్గొన్నారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఎమ్మెల్సీగా జయ సారథి రెడ్డినిగెలిపించాలి

 వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఎమ్మెల్సీగా జయ సారథి రెడ్డినిగెలిపించాలి

..వామపక్షాల నాయకులు

నెల్లికుదురు,పెన్ పవర్

వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల నియోజకవర్గ వామపక్ష పార్టీలఎమ్మెల్సీ  అభ్యర్థి జయ సారథి రెడ్డిని గెలిపించాలని కోరుతూ సోమవారంమహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో  ఆ పార్టీల మండల కార్యదర్శులు వరిపెల్లి  వెంకన్న,పెరుమాండ్ల తిలక్ బాబు లు మండల కేంద్రం నెల్లికుదురుమరియు ,పార్వతమ్మ గూడెంలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు పట్టభద్రులైన ఓటర్ల ఇళ్లలోకి వెళ్లి ప్రశ్నించే గొంతు విజయ సారథి రెడ్డిని గెలిపించడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్ ఇసంపెల్లి సైదులు తూటి వెంకట్ రెడ్డి,గారె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన

 రైతుల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పాలన

జగిత్యాల ,పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో నూతనంగా ఏర్పాటు అయిన బుగ్గరాం మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి స్వచ్చమైన త్రాగునీరు

 గ్రామాల సంపూర్ణ అభివృద్దే మా లక్ష్యం  బుగ్గరాం మండల ప్రజా పరిషత్ సర్వసభ సమావేశంలో బుగ్గరాం మండల జెడ్పిటిసి బాధినేని రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది రైతుల రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల సంక్షేమమే ద్యేమంగా పాలన సాగిస్తున్నారని బుగ్గరాం మండల జెడ్పిటిసి  బాధినేని రాజేందర్ అన్నారు. సోమవారం బుగ్గరాం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బాదినేని రాజమణి  మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  రైతుల కష్టాలను తొలగించే విధంగా రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్, రైతు భీమ, రైతుబంధు, సకాలలంలో పేదింటి ఆడ్డబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ షాదముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్న  ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు  సిఎం గారి మానసపుత్రిక మీషన్ భగీరధ పధకం ద్వారా ప్రతి ఇంటికి ఉచింతగా నల్లకనేక్షన్ తో పాటు స్వచ్చమైన త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు.  ప్రజల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా తాము పాలన చేస్తున్నమని గ్రామంలో సమస్యలను ఒకోక్కటిగా పరిష్కారం చేస్తు ముందుకు సాగుతున్నామన్నారు. ఆరేళ్ళ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని బంగారు తెలంగాణ సాధనలో తమవంతు పాత్ర పోషించామన్నారు  ఈ సమావేశంలో  వైస్ ఎంపిపి జోగినిపెల్లి సుసెంధర్  ఎంపీపీ కో ఆప్షన్ సభ్యులు రహమాన్  బుగ్గరాం మండల రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ రావు  మండలక్  సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ మండల ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు గాలిపెళ్లి మహేష్  తహశీల్దార్ పారఖ్  ఎంపీడీవో తిరుపతి  ఎంపీఓ అబ్దుల్ మియా  వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి

 సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధి

చిన్నగూడూరు,పెన్ పవర్

స్థానిక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా తెరాస నాయకులు సోమవారం నాడు ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.  రాష్ట్రం ఏర్పడిన  నుండి నిరుద్యోగులకు లక్షకుపైగా ఉద్యోగాలను చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, ఇంకా రానున్న రోజుల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరుగుతోందని తెలియజేశారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటికి వెళ్లి తమ మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మూల మురళీధర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, తెరాస మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, చెన్నారెడ్డి, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు మన్నె చెన్నయ్య, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు దొంగరి నరసయ్య, దేశగాని రమేష్, వీరాచార, సిహెచ్ ప్రవీణ్, మూల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

మహిళలు చైతన్యవంతమైన శక్తి

 మహిళలు చైతన్యవంతమైన శక్తి - రాష్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

సృష్టికి మూలం మహిళలని, మహిళా శక్తి లేనిదే సమాజమనుగడ ఒక్క క్షణం కూడా మనుగడ లేదని కావున మహిళలు ఒక చైతన్యవంతమైన శక్తి అని *రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల,పెన్ పవర్


 సోమవారం జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో  మంత్రి కొప్పుల ఈశ్వర్ విశీష్ట అతిధిగా పాల్గోన్నారు.   ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో మహిళల సాంప్రదాయాలు పద్దతుల ప్రత్యేకతలను గమనిస్తే మహిళల ఔనత్యం, సమాజంలో వారికి కల్పిస్తున్న ప్రత్యేకతను గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతామని అన్నారు.   మహిళలు అనేక  ఒత్తిడులు, వివక్షలకు గురికాకుండా చూడాల్సిన బాద్యత మనందరిపై ఉందని పేర్కోన్నారు.  నూటికి 75% మంది మహిళలు వారిపరిస్థితులను బట్టి సర్దుకుపోతు జీవనగమనాన్ని సాగిస్తున్నారని, చట్టాలు ఎన్ని ఉన్నప్పటికి వాటి అమలులో, ఆచరణలో మార్పు ఇప్పుడిప్పుడే వస్తుందని అన్నారు.  మహిళలు స్వేచ్చాయుతంగా ముందుకు సాగితే అనితర సాద్యమైన విజయాలను సైతం సాధించగలరని అన్నారు. సమాజంలో చట్టాలు ఎన్ని అమలు పరిచినప్పటికి మహిళపై పురుషుల ఆదిపత్యం ఇంకా కోనసాగుతుందనేది ఒప్పుకోకతప్పదని ,ఈ ఆదిపత్యంపై మహిళలు పోరాడి, ప్రశ్నించడం ద్వారానే విజయాన్ని సాధించాలని పేర్కోన్నారు.   చిన్న వర్గాలైన ఎస్సి, ఎస్టి మరియు అటవి ప్రాంతాలలో చిన్న వయస్సులో పెళ్లిలు జరుగకుండా నిరోదించిందని, ఆడపిల్లల పెళ్లిని తల్లితండ్రులు బారంగా బావించకుండా, 18 సంవత్సరాలు పైబడిన పెళ్లిచేసుకున్న మహిళలకు కళ్యాణలక్ష్యి, షాధిముబారక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళల అభ్యున్నతి ఎల్లవేల్లల ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కోన్నారు. అంగన్ వాడి, ఆశా, పారిశుద్య కార్మికులు మొదలకు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా మహిళా ఉద్యోగులకు సమాన వేతనాలను అందించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. కేజి టు పీజి విద్య ఖచ్చితంగా అమలు చేయాలనే సంకల్పంతో అంగన్ వాడి కేంద్రాలలో టిచర్లకు ఆంగ్లవిద్యపై శిక్షణను అందించి, ఆంగ్లవిద్యపై పిల్లలు బయబ్రాతులకు గురికాకుండా మక్కువ పెంచుకునే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు .మైనారిటి, బిసి మరియు సంక్షేమ విద్యాలయాలలో బాలికల సంఖ్య ఎక్కువ ఉందని, ఇది భవిష్యత్తులో స్త్రీలదే కీలకమనేది నిదర్శనంగా గుర్తించుకోవాలని అన్నారు.  ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు మహిళలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనిదని, ఇంట్లో జరిగే ఏ కార్యక్రమంలోనైన ఎక్కువగా శ్రమించేది మహిళలే అని అన్నారు. రానున్న కాలంలో మహిళలు అన్నిరంగాలలో విజయాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.  మహిళలకు అర్థిక బరోసాను కల్పించాలనే లక్ష్యంగా జిల్లాలో పైలెట్ ప్రాజేక్టుగా ప్రవేశ పెట్టిన సహజ ప్రాడక్టు పై అందరిలో విశ్వాసాన్ని కలిగించేలా మహిళలు కృషిచేసి ఘనవిజయాన్ని సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు పిడి డిఆర్డిఎ లక్ష్మీనారాయణ డి డబ్ల్యూ ఓ నరేష్ మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఇ సుందరరాజన్ మహిళలు పాల్గొన్నారు

ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించిన కూనా శ్రీశైలం..

 ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించిన కూనా శ్రీశైలం..

కుత్బుల్లాపూర్,పెన్ పవర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను బీజేపీ నాయకులు కూనాశ్రీశైలంగౌడ్ ఘనంగా నిర్వహించారు.. షాపూర్ నగర్ లోని ఆయన నివాసంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన మహిళలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నారీ శక్తి సైనిక, వాయు, నావిక మరియు ఇతర రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, నావికా రంగంలో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో ప్రపంచంలో మొదటి సారిగా స్వర్ణ కృష్ణ అనే నౌక యాత్ర చేపట్టడం దీనికి నిదర్శనమని కూన శ్రీశైలంగౌడ్ గుర్తు చేశారు. కరోనా విపత్కర సమయంలో ఇంట్లో మహిళల పాత్ర ఎనలేనిదని వారి సేవలు ఎప్పటికీ మరువలేమని కొనియాడారు . తెలంగాణ రాష్ట్ర మహిళలకు మరియు బిజెపి మహిళా మోర్చా నాయకురాళ్ళకు కార్యకర్తలకు ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలతో కలిసి కూనా కేక్ కట్ చేశారు.. ఈ కార్యక్రమంలో పద్మ, షబానా, కల్పన, దేవి ,రాధిక, మాధవి ,లావణ్య, పావని, మంగ, పలువురు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...