Followers

అభినవ స్వచ్చంద సేవ సంస్థ ప్రయాణికుల కోసం ప్రయాణ ప్రాంగణం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు

 అభినవ స్వచ్చంద సేవ సంస్థ ప్రయాణికుల కోసం ప్రయాణ ప్రాంగణం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు

తాండూర్, పెన్ పవర్

అభినవ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో సేవాసంస్థ వ్యవస్థాపక చైర్మన్ కాసనగొట్టు (కేశెట్టి)సుగుణకర్ జన్మదినం సందర్భంగా సేవాసంస్థ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులకోసం ప్రయాణ ప్రాంగణం(బస్ షేడ్) మరియు చలివేంద్రాన్ని తాండూరు సి ఐ కోట బాపురావ్ , తహసీల్దార్ కవిత , జెడ్పీ టిసి బాణయ్య , ఏంపిడిఓ శేషికల తాండూరు ఎస్ ఐ శేఖర్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ఏం పి టి సి మాసడి శ్రీదేవి శ్రీరాములు ,తాండూరు సర్పంచ్ నవీన్,వార్డ్ మెంబెర్ కేశెట్టి తిరుపతి, సేవాసంస్థ సభ్యులు తోగారి  శ్రీ శ్రీనివాస్

పోట్లపల్లి  రాజ్ కిరణ్, తోగారి కుమార్ ,ఉటూరి నరేష్ , ఎముర్ల ప్రదీప్, గాదె కుమార్ ,ఏకారి సత్యనారాయణ, కేశెట్టి సతీష్ కుమార్, అక్షయ , కాసం ఆకాష్,,బోగే శ్రీకాంత్,  నాయకులు తిరుపతి,  జాడి పొశం , బోనగిరి చంద్రశేఖర్ , కాసనగొట్టు బాపూజి , బోనగిరి విగ్నేశ్ , వెంకట రమణ , తుకరం  తదితరులు పాల్గొన్నారు.

పింఛను ఇప్పించండి సారూ...

 పింఛను ఇప్పించండి సారూ...

కన్నెపల్లి ,  పెన్ పవర్ 

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని తాళ్ల రెబ్బన కు చెందిన వృద్ధులు, వికలాంగులకు ఆసరా పింఛన్ కు నోచుకోని పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ కిందిస్థాయి అధికారుల వల్ల నీరుగారి పోతుందని వృద్ధులు వికలాంగులు వాపోయారు. దీనికి నిదర్శనమే ఈ మూగ వికలాంగులు కుమ్మరి సాయమ్మ  మూగ వికలాంగురాలు కి కొద్దికాలంగా తెలంగాణ గవర్నమెంట్ పెన్షన్ వచ్చిందని ఇప్పుడు రావట్లేదు అని ఆమె బంధువులు వివరించారు. దుర్గం జంపన్న మూగ వికలాంగుడికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెన్షన్ వచ్చిందని ఈ ప్రభుత్వం  వచ్చిన తర్వాత వికలాంగుల పెన్షన్ రావట్లేదని వికలాంగుడి తల్లి వాపోయింది .దయచేసి అధికారులు, నాయకులు పట్టించుకొని పెన్షన్ ఇప్పించగలరని వారు కోరారు.

జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం

 జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునికి  ఆత్మీయ సన్మానం

రాజన్న సిరిసిల్ల ,  పెన్ పవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షునిగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఎల్లారెడ్డిపేట విశ్వ బ్రాహ్మణులను ఆత్మీయంగా పలకరించడానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘ అధ్యక్షుడు చందనగిరి గోపాల స్వామి. ఎల్లారెడ్డిపేట మండలం లోని పలు గ్రామాల అధ్యక్షులు రాచర్ల బొప్పాపూర్ లో గల బ్రహ్మంగారి దేవాలయంలో సభను ఏర్పాటు చేయగా సభకు విచ్చేసిన చందనగిరి గోపాలస్వామి ని శాలువా కప్పి పలు గ్రామాల అధ్యక్షులు మండల అధ్యక్షుడు చెలిమెలి అంజనేయులు చారి జిల్లా కోశాధికారి  దుమాల శంకర్ చారి మండల ప్రధాన కార్యదర్శి వంగాల వసంత్ చారి కోశాధికారి కాంబోజి దేవరాజు చారి ప్రచార కార్యదర్శి శ్రీరాముజు దేవరాజు చారి రాజు చారి శ్రీధర్ ఆచారి వంగాల నాగభూషణం చారి మండో జు రాజయ్య చారి వంగాల శ్రీనివాస చారి మరియు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు సభ్యులు శాలువా కప్పి సన్మానించడం గా చందనగిరి గోపాల స్వామి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నా భుజస్కంధాలపై బాధ్యతను ఉంచిన మీ బాధ్యతలను ఎల్లవేళలా విశ్వబ్రాహ్మణుల కై పోరాడుతానని విశ్వబ్రాహ్మణులు నిరుపేదలు ఉన్నారని రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు ఉన్నాయని విశ్వ బ్రాహ్మణులందరికీ వృత్తి లేబర్ కార్డు ఇప్పిస్తాననిమన జిల్లాలో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణుని కి ఐడెంటి కార్డు చేయించి ఇస్తానని విశ్వబ్రాహ్మణులకు అన్ని వేళలా ఆపదలో నైనా స్పందిస్తానని మనమందరం ఐక్యమత్యంగా ఉంటేనే మన మన విలువలు ప్రభుత్వానికి తెలుస్తాయని ప్రభుత్వం దగ్గర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడే వరకు పోరాడుతానని ఆయన అన్నారు.

అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు.

 అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు..

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు

లక్షెట్టిపెట్, పెన్ పవర్

అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు స్పష్టం చేశారు.మండలంలోని గుళ్లకోట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఆయన గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్టం ఏర్పాటు తర్వాత గ్రామం అద్దంలా అభివృద్ధి చేయడంమే లక్ష్యంగా పెట్టుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు.గతంలో ఏ ప్రభుత్వలు కూడా మన ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు ముందుకు రాలేదన్నారు.ఇప్పుడు ఏమారు మూల గ్రామం వెళ్లిన సీసీ రోడ్డులు, డ్రైనేజీలు 80శాతం పూర్తి అయ్యాయన్నారు.ఇక్కడ కూడా సుమారు 9లక్షల రూపాయల నిధులతో జాతీయ రహదారి నుండి గ్రామం లోపలి వరకు రోడ్డును నిర్మించడం జరిగిందన్నారు.ఇలాంటి మంచి కార్యక్రమలు చేస్తే గిట్టని పార్టీలు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని వాళ్లకి ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోళ్ళ రవీందర్,డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగయ్య,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,పిఎసీఎస్ చెర్మాన్ ప్రబాకర్ రావు,పార్టీ మండల అధ్యక్షుడు చిన్నయ్య,ఉపాధ్యక్షుడు రమేష్ నాయకులు అసాది పురుషోత్తం,కిషన్,చతరాజు రాజన్న,తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేత

 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆర్థికసాయం అందజేత

లక్షెట్టిపెట్, పెన్ పవర్

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అనారోగ్యానికి గురైన వ్యక్తి కి గురువారం ఆర్థిక సహాయం అందజేశారు.మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామనికి చెందిన వేముల భూమయ్య  అనే వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో ఉందని విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు మానవత్వంతో పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి కుటుంబానికి బాసటగా నిలిచారు.ఈ సందర్భంగా సంఘ  సభ్యులు పలువురు మాట్లాడుతూ అనారోగ్యం నుండి భూమయ్య తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్దిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పద్మశాల అద్యక్షుడు వేముల రాజగురువయ్య,ఇటిక్యాల పద్మశాల అద్యక్షుడు కట్ల చంద్రయ్య,ఉపాద్యాక్షాలు హన్మండ్ల రాంచందర్,సభ్యులు వేముల గుండ శోభన్,కట్ల శ్రీనివాస్ సత్తయ్య,అంకం రమేష్,వేముల రామన్న ,సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కు సన్మానం

 ఎమ్మెల్యే కు సన్మానం

నెన్నెల, పెన్ పవర్

 మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం సర్పంచ్ ల సమస్యలపై,సర్పంచ్ లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను నెన్నెల మండల సర్పంచుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. నెన్నెల మండల సర్పంచుల సంఘము అధ్యక్షుడు గొర్లపల్లి బాపు మాట్లాడుతూ సర్పంచుల ఇబ్బందులు సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో నెన్నెల మండల సర్పంచులు అందరూ పాల్గొన్నారు.

ఏరియాలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి

ఏరియాలో 62 శాతం బొగ్గు ఉత్పత్తి

--ఏరియా జిఎం చింతల శ్రీనివాస్

మందమర్రి,  పెన్ పవర్

మందమర్రి ఏరియాలో మార్చి మాసంలో  62 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం స్థానిక జిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,మార్చి మాసంలో ఏరియాలోని ఆర్కే 1ఎ‌,కేకే 1,కేకే ఓసిపి గనులు వంద శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు.మార్చి మాసంలో  ఏరియాలోని  కేకే-1 గని 105శాతం ఉత్పత్తి సాధించగా,కేకే-5 గని 79శాతం,ఆర్కే 1ఎ గని 100శాతం,కాసిపేట గని 52శాతం,కాసిపేట-2 గని 17శాతం,శాంతిఖని గని 35శాతం,కేకే ఓసిపి 121శాతం, ఆర్కే ఓసిపి 22శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏరియా 49శాతం ఉత్పత్తి సాధించిందని, ఉత్పత్తి వివరాలను తెలియజేశారు.మార్చి నెలలో భూగర్భ గనుల ద్వారా 52 శాతం ఉత్పత్తి సాధించగా, ఓసిపి ల ద్యారా 65 శాతం ఉత్పత్తిని సాధించినట్లు ఆయన వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో  నిర్దేశిత లక్ష్యానికి కేకే-1 గని 66శాతం,కేకే-5 గని 60శాతం,ఆర్కే 1ఎ గని 64శాతం,కాసిపేట గని 43శాతం,కాసిపేట-2 గని 25శాతం,శాంతిఖని గని 39శాతం,కేకే ఓసిపి 77శాతం, ఆర్కే ఓసిపి 27శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయని వివరించారు.2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యంలో భూగర్భ గనుల ద్వారా 46 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగా, ఓసిపి ల ద్యారా 49 శాతం ఉత్పత్తి  లక్ష్యాన్ని సాధించి,2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏరియా 49శాతం ఉత్పత్తి సాధించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  ఏరియా  ఇంజనీర్, ఏజిఎం జగన్మోహన్ రావు,ఐఇడి(డిజిఎం) రాజన్న,పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డివైపిఎం శ్యాం సుందర్,సీనియర్ పిఓ  సత్యబోస్ తదితరులు పాల్గొన్నారు. 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...