Followers

అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎన్ని రామచంద్రరావు

 అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన ఎన్ని రామచంద్రరావు

ఆమదాలవలస రూరల్, పెన్ పవర్

పేదలను ఆదుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు అన్నారు. మండలంలోని కట్యాచార్యుల పేట గ్రామ సచివాలయంలో అర్హులకు పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.


సువ్వాడ మరణం తీరని లోటు

సువ్వాడ మరణం తీరని లోటు


మెంటాడ, పెన్ పవర్ 

సాలూరు మండలం వైసీపీ కన్వీనర్ దువ్వాడ రమణ అకాల మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటని సాలూరు ఎమ్మెల్యే పీడి క రాజన్న దొర అన్నారు.  చివరి చూపులు చూడలేకపోయానని ఎమ్మెల్యే రాజన్నదొర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో    సహనం, ఓపిక,సత్త సహకారం అనే నాలుగు నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు సువ్వాడ.రమణ  అని రాజన్నదొర కొనియాడారు.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాలూరు మండలంలోని సువ్వాడ. రమణ నాయకత్వంలో వైస్సార్సీపీ బ్రహ్మాండమైన మెజారిటీ రావడానికి రమణ  కృషి చేశారని రాజన్న దొర గుర్తు చేసుకున్నారు.  పెద్ద వయస్సు అయినందున,వేసవికాలం అయినందున గడపగడపకు కార్యక్రమం, పాదయాత్ర కార్యక్రమంనకు రావొద్దున్నా ఎమ్మెల్యే రాజన్నదొర గారి కంటే ముందే ఉండేవారు. 2018 సంవత్సరం జనవరి నెలలో ఎమ్మెల్యే గారు కొఠియా నడిచి రావద్దు అని చెప్పినా ఎమ్మెల్యే రాజన్నదొర గారితో,మాజీ జడ్పీటిసి రెడ్డి.పద్మావతి గారితో మరియు ఇతర వైసీపీ నాయకులతో పోటీగా ఏజెన్సీ ప్రాంతంలో నడిచారు. బహుశా సాలూరు మండలంలోని ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట లేకుండా ఎమ్మెల్యే గారి ఏ కార్యక్రమమైనా సరే అది రాజకీయమైన,వివాహామైన, చావైన,పండగైనా,పలకరింపైనా సరే నాకు తెలిసి వెళ్లలేదేమో. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో చివరగా ఎమ్మెల్యే రాజన్నదొర గారు ప్రచారం చేసిన ఎంపీటీసీ ఎన్నిక కూడా సువ్వాడ.రమణ గారిదే.  నునిత్యం ఎమ్మెల్యే రాజన్నదొర గారి వెంట ఉండి ఇప్పుడు రాజన్నదొర గారికి,ఆయన కుటుంబానికి, వైస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కనిపించకుండా, అగుపించకుండా హఠాత్తుగా మాయమై అందనంత దూరానికి వెళ్లిపోయారని, సువ్వాడ రమణ గారిని చివరి సారిగా చూసే అవకాశం కూడా కలుగలేదు అని ఈ బాధను ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని సువ్వాడ.రమణ గారి జ్ఞాపకాలు,సేవలు స్మరిస్తూ ఆయన నాయకత్వం,అంకిత భావం ఎల్లవేళలా మాతో ఉంటాయని ఆయన స్పూర్తితో నేను,మా నాయకులు మరియు కార్యకర్తలు ముందుకు నడుస్తాం అని  ఎమ్మెల్యే రాజన్నదొరగారు  దిగ్బ్ర్హాంతి వ్యక్తం చేశారు.                                                                                                            

మేమూ మనుషులమే...

 మేమూ మనుషులమే...

విరామం లేకుండా విధులేలా....
రిమ్స్ స్టాఫ్ నర్సుల ఆందోళన...

పెన్ పవర్, శ్రీకాకుళం

విరామం లేకుండా త‌మ‌తో రిమ్స్ న‌ర్సింగ్ సూప‌రెండింట్  విధులు నిర్వ‌హించేలా త‌మ పై ఒత్తిడి తెస్తున్నార‌ని ఆరోపిస్తూ  ఆదివారం స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని స్టాప్ నర్సులు ఐక్యంగా నిర్వ‌హించారు.తామంతా కోవిడ్ విధులు నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇప్ప‌టికే త‌మ‌లో కొంత‌మంది కోవిడ్ బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతున్నార‌ని స్టాప్ న‌ర్సులు వాపోయారు. త‌మ‌కు శెలవులు ఇవ్వ‌కుండా న‌ర్సింగ్ సూప‌రెండెంట్ ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు విమ‌ర్శించారు.ఈ నేప‌ధ్యంలో తామంతా నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల్సి వ‌చ్చిందని వారంతా పేర్కొన్నారు.స్టాప్ న‌ర్సుల నిర‌స‌న కార్య‌క్ర‌మం ద‌గ్గ‌ర‌కు విచ్చేసిన జేసి సుమిత్ కుమార్‌కు త‌మ స‌మ‌స్య‌ల‌ను స్టాప్ న‌ర్సులు విన్న‌వించారు. సీనియ‌ర్ ఉద్యోగుల‌కు అయితే శెల‌వులు ఇస్తున్నార‌ని, కొత్త‌గా చేరిన త‌మ‌కు నిబంద‌న‌లు ప్ర‌కారం ఇవ్వాల్సిన శెలువులు కూడా ఇవ్వ‌డం లేద‌ని జేసి కి వివ‌రించారు. శెలవులు లేకుండా తామెలా ప‌నిచేయ‌గ‌ల‌మ‌ని, ఒత్తిడితో తీవ్రంగా బాద‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. స్పందించిన జేసి  స్టాప్ న‌ర్సుల‌తో మాట్లాడుతూ  శెలవులు లేకుండా ప‌నిచేయ‌డం ఏంట‌ని, డ్యూటీ దిగాక 5 రోజులు పాటు శెలవులు ఉండేలా  చేయాల‌ని, ఆ విధంగా విధులు నిర్వ‌హించాల‌ని,ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగాలు చేయాల‌ని కోరారు. సెకెండ్ వేవ్ దృష్ట్యా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జేసి సుమిత్ సూచించారు.రు. జేసి హామితో స్టాప్ న‌ర్సులు శాంతించి నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విడిచి జేసికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


సెల్కాన్ కంపెనీ ప్రమాదం లో కార్మికుని మృతి

 సెల్కాన్ కంపెనీ  ప్రమాదం లో కార్మికుని మృతి

పరవాడ, పెన్ పవర్ 

ఫార్మా సిటీలో సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆదివారం రాత్రి బాయిలర్ వద్ద బొగ్గు పనులు నిర్వహిస్తుండగా  గోడకూలి బాయిలర్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందారు అని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ తెలియ జేశారు. మృతదేహాన్ని యాజమాన్యం విశాఖ కేజీహెచ్ తరలించింది అన్నారు. 

ఈ ప్రమాదంలో మృతిచెందిన   జి.తులసిరావు వయసు 32 తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వ్యకి కుటుంభ పోషణార్ధం ఫార్మాసిటీ లోని సెల్కాన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో బ్రాయిలర్ అపరేటర్ గా పనిచేస్తున్నాడు అని అన్నారు. కుటుంబానికి ఇతడే ఆధారం అని తులసిరావు మృతితో ఆ కుటుంభం ఎంతో నష్టపోయింది అని గనిశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి నష్ట పరిహారం ఉద్యోగం కల్పించాలని భద్రతా ప్రమాణాలు అమలు చెయ్యని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.  సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు ప్రభుత్వం ఇప్పటికైనా మెల్కోని భద్రతా ప్రమాణాలు అమలు చేయని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇప్పటికి అయిన మంచి నిర్ణయం తీసుకున్నారు

 ఇప్పటికి అయిన మంచి నిర్ణయం తీసుకున్నారు

పెన్ పవర్, శ్రీకాకుళం

 ప్రశాంత్ కిషోర్  మీరు వ్యూహకర్తగా రాజకీయాల్లో, రాజకీయ పార్టీలకు ఇచ్చే సలహాలు సూచనలు సందర్భంలో మీరు చాలా తెలివైనవారుగా మాకు కనబడుతూ వుంటారు.  అటువంటి సందర్భంలో మీరు ఈరోజు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు . నాకు చాలా సంతోషంగా ఉంది ఇకనుంచి నేను వ్యూహకర్తగా పని చేయను అన్నటువంటిది, చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను.  రాజకీయాలు అనేవి ఒక లక్ష్యంతో పని చేసినటువంటిది ఆ లక్ష్యం కోసం నిస్వార్ధంగా ముందుకు పోవాల్సిన విధానం,  అటువంటి సందర్భంలో ప్రజలను మీ ఆలోచనల మేరకు వాళ్లను మభ్యపెట్టి రిజల్ట్ ను తారుమారు చేయవలసినటువంటి శక్తి వంతమైన పని చేస్తున్నా అనే విధానంలో మీరు ముందుకు వెళ్లటం నేను చూశాను అని మాజీ  మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారు తెలియజేశారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నేను ముందుగా పసిగట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఈ విధంగా పనిచేయటం ప్రజాస్వామ్య సిద్ధాంతానికి సరైనది కాదు అన్నట్టువంటిదే నా భావన అని చెప్పి కచ్చితంగా చెప్పినటువంటి అనేక స్టేట్మెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ప్రతి మేధావి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాలి, అదేవిధంగా సమాజం ముందుకు పోవటం కోసమే, తాను నచ్చిన సిద్ధాంతాలకు బలపరిచిన లీడర్ షిప్  కోసమే ఒక లక్ష్యం కోసం పని చేయాలి అంతే తప్ప  ప్రజలను మభ్యపెట్టి  వ్యక్తుల్ని కల్పించటం కోసమని చెప్పి మన ఆలోచన మేరకు గెలిపించటనికి తగిన చర్యలు తీసుకోవటం అనేది మాత్రం రాజకీయ సిద్ధాంతం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.


మూర్రాట తో అమ్మవారికి పూజలు

 మూర్రాట తో అమ్మవారికి పూజలు

శ్రీకాకుళం, పెన్ పవర్

 స్థానిక పెదరెల్లి వీధి  శబరి యువ జనసేవ సంఘం యువకులు ఆదివారం  కరోనా వైరస్ మహమ్మారి  నుండి జిల్లాని  రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలని మహిళలతో కలిసి అమ్మవార్లకు మూర్రాట లతో పాదయాత్ర నిర్వహించారు. శ్రీ విజయదుర్గా అమ్మవారి కి మూర్రాటతో అమ్మవారికి చల్లదనం చేశారు. అక్కడి నుండి  ముత్యాలమ్మ, నూకాలమ్మ, మరిడమ్మా లకు మూర్రాటలతో  చల్లదనం చేసారు. ఈ సందర్బంగా జిల్లా నాల్గవ తరగతి అధ్యక్షులు అరుగుల తారకేశ్వరరావు మాట్లాడుతూ  దేశాన్ని  కరోనా మహమ్మారి కమ్మేస్తోందని, ఈ విపత్తు నుండి కాపడాలని  నగరం లొ ఉన్న  అమ్మవార్లకు మూర్రటలు సమర్పిచడం జరిగిందన్నారు. ప్రజలందరూ  భయానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని  ఈ వైరస్ ను  ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.  విధిగా మాస్క్, శానిటైజర్ ని వాడాలని, భౌతిక దూరం పాటించాల అన్నారు. ప్రభుత్వం వారి సూచనలను తప్పని సరిగా పాటించాలని కోరారు.


కరోనా లో కాసుల కక్కుర్తి

 కరోనా లో కాసుల కక్కుర్తి

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ కి  అడ్డేది...

పెన్ పవర్, శ్రీకాకుళం

 సెకండ్ వెవ్ కరోనా మరణమృదంగం లో ధనిక, పేద, భేదం, లేకుండా  జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కనీస వైద్య సదుపాయం అందించడం లో నిర్లక్షం ­వైఫల్యం కారణంగా ఆక్సిజన్ లభ్యత కొరత ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిల దోపిడికి నిరుపేదల  ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిమ్స్ తో సహా పలు ఆసుపత్రులను కోవిడ్ ఆసుపత్రులగా ప్రకటించినా కరోనా బాధితులకు ఆ స్థాయి లో వైద్యం అండటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని  ఆసుపత్రుల నుండి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులలో   కోవిడ్ వైద్యం కోసం లక్షల్లో దోచేస్తున్నాయి. 

కోవిడ్ సోకిన రోగికి ఏ వైద్యం అందిస్తున్నారు. ఏ ఇంజక్షన్ ఇస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. ఎలాగైనా ప్రాణాలు నిలవాలని ఆసుపత్రికి తీసుకెళితే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామో రామో తెలియక  కోవిడ్ బాధిత   కుటుంబాలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ప్రభుత్వం  జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్లససంఖ్య పెంచి రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఆక్షిజన్ లభ్యత పెంచి కోవిడ్ రోగుల  ప్రాణాలు కాపాడాల్సిన.అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కరోనా మరణ మృదoగానికి ప్రభుత్వం భాద్యత వహించాలి.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...