Followers

బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

 బెల్లంపల్లి స్వచ్ఛంద లాక్ డౌన్ ప్రారంభం

బెల్లంపల్లి, పెన్ పవర్

బెల్లంపల్లి లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు చైర్పర్సన్ శ్రీత. శ్రీధర్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ కరోనా కట్టడి కోసం వ్యాపార యజమానులతో మాట్లాడి అన్ని రకాల వ్యాపార సంస్థలు  స్వచ్ఛందం గా  లాక్ డౌన్ లో పాల్గొనాలని అన్నారు ఇందులో భాగంగా మంగళవారం 3. గంటల నుంచి  మొదటిరోజు బజార్ ఏరియా లోని దుకాణ యజమానులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ...

పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే

 పండుగలు పెళ్ళిళ్ళు వాయిదా వేయాల్సిందే…

 నిబంధనలు ఉల్లంఘిస్తే కోవిడ్ చట్ట ప్రకారం చర్యలు.

నెల్లికుదురు తహసిల్దార్. అనంతుల రమేష్ కుమార్

నెల్లికుదురు,పెన్ పవర్

 కరోణ సెకండ్  వేవ్ వేగంగా విస్తరిస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజలు ఎవరు కూడా  మాస్కులు లేకుండా బయట సంచరించ కూడదని,  ఒకవేళ అత్యవసర పని ఉన్నట్లయితే మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ బయటకి రావాలని మహబూబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం తాసిల్దార్ అనంతుల రమేష్ కుమార్ ప్రజలను హెచ్చరించారు మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ గ్రామాలలో ఫంక్షన్లు,  పెళ్లిళ్లు,  ఎలాంటి పండుగలైన జరుపుకునేవారు వాయిదా వేసుకోవాలని,  పెళ్లిళ్లు తప్పనిసరి చేయాలి అనుకునేవారు అధికారుల అనుమతి పొంది కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించు కోవాలని లేనిపక్షంలో కోవిడ్ చట్ట ప్రకారము ఎంతటివారి పైన గాని చర్యలు  తీసుకోబడుతుంది అని తెలియజేశారు.

ఆందోళన వద్దు

 ఆందోళన వద్దు...

సెంటర్ల సంఖ్య పెంచుతాం - ఎమ్మెల్యే మైనంపల్లి

పెన్ పవర్, మల్కాజిగిరి

వ్యాక్సినేషన్, కరోనా టెస్ట్ ల గురించి నగర ప్రజలు ఆందోళన చెందవద్దు, ఇప్పటికే ఉన్న సెంటర్లకు అదనంగా నేరేడ్మట్ డివిజన్ లో రెండు, ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ లో రెండు, గౌతం నగర్ డివిజన్లో మూడు, మల్కాజిగిరి డివిజన్ లో మూడు, వినాయక్ నగర్ డివిజన్ లో ఒకటి వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించాం. వ్యాక్సినేషన్ సెంటర్లే కాకుండా టెస్టింగ్ సెంటర్ల సంఖ్యను పెంచుతాం అన్ని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

మాస్క్ ధరించకుంటే జరిమానా

 మాస్క్ ధరించకుంటే జరిమానా, లేదంటే జైలుకే

పెద్దగూడూరు, పెన్ పవర్ 

కొత్తగూడ ఎస్సై సురేష్  కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో రెండు రోజులుగా మహబూబబాద్ జిల్లా కొత్తగూడ లో మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి ఫైన్ లు పోలీసులు వసూలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వాహనదారుపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఒక్కొక్కరికి 1000/- జరిమానాను కొత్తగూడ ఎస్సై సురేష్ విధిస్తున్నారు. ఇప్పటికే పదూల సంఖ్యలో ఈ చలాన్ల రూపంలో జరిమానాలను పంపించారు. ఇక పై బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా కనబడినట్లయితే వారి పై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. వ్యాపారస్తులు కూడా మాస్క్ ఉంటేనే కస్టమర్లను షాపుల్లోకి అనుమతించాలని, దీన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. కోవిడ్ ని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపైన క్రిమినల్ కేసులు కూడా తప్పవని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్​ ధరించకుంటే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి, కోర్టులో హాజరుపరుచుతామని తెలిపారు. పదుల సంఖ్యలో ఈ-చలానాలు పంపామన్నారు. ఇక జరిమానా సొమ్ము చెల్లించని వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపుతామంటున్నారు పోలీసులు. మాస్క్ అనేది మీ రక్షణ కోసమేనని ధరించాలనీ, దయచేసి పోలీసులు ఫెనాల్టీ లు విధిస్తారని మాత్రం ధరాంచకండి అని ఎస్సై సురేష్ విజ్ఞప్తి చేశాడు.

ఘనంగా బేలా సర్పంచ్ జన్మదిన వేడుకలు

 ఘనంగా బేలా సర్పంచ్  జన్మదిన వేడుకలు ...

బేలా, పెన్ పవర్ 

సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వట్టిపల్లి ఇంద్రశేఖర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరాడంబరంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయనకు మండల టిఆర్ఎస్ నాయకులు,యువజన సంఘాల నాయకులు పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యువజన సంఘాల నాయకుల రవి, సునీల్, రాహుల్, యాదవ్, అజయ్, అంకుష్తదితరులు పాల్గొన్నారు.

పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

 పేదింటి బిడ్డ పెండ్లికి ఆర్ధిక, సహాయం అందించిన, టిఆర్ఎస్ నేత

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి పట్టణానికి చెందిన టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే మందమర్రి పట్టణంలోని 23వ వార్డు మేదర్ బస్తీ కి చెందిన  రామగిరి మల్లేష్ శంకరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మంగలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న రామగిరి మల్లేశ్ పెద్ద కూతురు రామగిరి శ్వేత వివాహము మే 16వ తేదీన నిశ్చయం కాగా పెళ్లి చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో  వీరి కుటుంబ సభ్యులు మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ ను కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే ఆర్ధిక సహాయంగా 20 వేల రూపాయల చెక్కు తోపాటు ఒక క్వింటాలు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం లో రాజ్ కుమార్ రంగనాథ్, సతీష్ , రిధం సది , బంటి తిరుపతి, ప్రసాద్, రఘు గంగుల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.ఆర్ధిక సహాయం ను అందించిన బండి సదానందం కు రామగిరి మల్లేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

 కరోనా వైరస్ తో రేషన్ కార్డుదారుల ఇక్కట్లు

బెల్లంపల్లి , పెన్ పవర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా కార్డుదారులు వివిధ కారణాలవలన ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో ప్రస్తుతం ఐరిష్ వలన వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో తెలంగాణ రేషన్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం డీలర్లు రేషన్ నిలిపివేయడం జరిగింది. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని కార్డుదారులు కూడా ఐరిష్ తో రేషన్ తీసుకోవడానికి భయాందోళనకు గురవుతున్నారు. కావున రెవిన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇతర ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్లు మరియు కార్డు దారులు కోరుతున్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...