శ్రీకాకుళం, పెన్ పవర్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ గారి సారధ్యంలో అహర్నిశలు చేస్తున్న జిల్లా యంత్రాంగం కృషిని అభినందిస్తూ, జిల్లాలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న పేదవారికి, రోజువారీ కార్మికులకు 21 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసేందుకు మరియు కరోనా బాధితులకు ఇతర సహాయక చర్యలు చేపట్టేందుకు సామాజిక బాధ్యత క్రింద సి. వి. నాగజ్యోతి ఛారిటబుల్ & వెల్ఫేర్ సొసైటీ ఒక లక్ష రూపాయల చెక్కును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బుదవారం జిల్లా కలెక్టర్ శ్రీ జె. నివాస్ కి అందజేసారు, సొసైటీ కార్యదర్శి మరియు రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు, కోశాధికారి, కె. దుర్గా శ్రీనివాస్ మరియు పి.శ్రీకాంత్ సొసైటీ తరపున పాల్గొన్నారు.
No comments:
Post a Comment