ఆత్రేయపురం, పెన్ పవర్
కరోనా వైరస్ వ్యాపించకుండా మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుధ్య పనులు, వాటర్ టాంకుల క్లీనింగ్ , డ్రైనేజీల క్లీనింగ్ , బ్లీచింగ్ స్ప్రే తదితర కార్యక్రమాలను గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఆద్వర్యంలో చేస్తున్నట్లు ఎంపీడీఓ నాతి బుజ్జి, ఈవో ఆర్డీ శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు ఉగాది పండుగ రోజు అయినప్పటికీ అన్ని గ్రామాల్లో పారిశుధ్య సిబ్బంది పనిచేసి, ప్రస్తుత పరిస్తితులలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసు, వైద్య సిబ్బందితో పాటు మంచి సేవలు అందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బందిని ఎంపీడీఓ అభినందించారు. ఎక్కడా మంచినీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు.
No comments:
Post a Comment