Followers

నాటు పడవ మునిగి వ్యక్తి మృతి







 

ఏలేశ్వరం, పెన్ పవర్  : నాటు పడవ మునిగి వ్యక్తి మృతి చెందిన ఘటన ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు సీఐ ఏ సన్యాసిరావు తెలిపిన వివరాల ప్రకారం....తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం, మర్రివీడు గ్రామానికి చెందిన మత్స్యకారుడైన నగెర శ్రీను వృత్తి లో బాగంగా ఏలేరు ప్రాజెక్ట్ లోకి చేపలు పట్టేందుకు గాను సుమారు ఉదయం 6 గంటలకు వెళ్ళాడని అన్నారు. వాతావరణం లో మార్పులు కారణంగా మబ్బులు కమ్ముకుని అతి వేగమైన గాలులతో అలలు రావడంతో నాటు పడవ మునిగి మరణించి ఉంటాడని తెలిపారు. ఇతనికి భార్య లక్ష్మి, కుమార్తె ఏంజెల్  ఉన్నారు. ఏలేశ్వరం ఎస్ ఐ కే సుధాకర్, విఆర్వో ఆర్ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.
 






 


 



 



No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...