Followers

 కాలినడకన వెళ్లే ప్రయాణికులకు ఆహార పొట్లాలు పంపిణీ





 

 

ఏలేశ్వరం, పెన్ పవర్ 

 

పట్టణంలోని  అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మాచారి నాగ మృత్యుంజయ శర్మ బృందం ఆధ్వర్యంలో ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ ఆహార పొట్లాలను నేషనల్ హైవే ఎర్రవరం నుండి విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు వెళ్లి నడిచి వెళుతున్న ప్రయాణికులకు సుమారు రెండు వందల మందికి భోజనం ప్యాకెట్లను శర్మ బృందం అందజేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ సందర్భంగా కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ తో వాహనాలను నిలుపుదల చేయడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రయాణికులు తమ తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు  కాలినడకన వెళ్తున్నారని మార్గంమధ్యలో వారికి కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకడం లేదని వారి దాహార్తిని ఆకలిని తీర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మువ్వ శ్రీరామచంద్రమూర్తి, నూకల సుబ్రమణ్యం, ఎస్ రవికుమార్, పి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


 

 



 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...