నిబందనలు ఉల్లంఘిస్తే  అరెస్టులు తప్పవు.
    జిల్లా కలక్టర్ వినయ్ చంద్.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)
 జిల్లాలో గురు వారం నుంచి కఠినమైన ఆంక్షలు అమలులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నియంత్రణ లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా కర్యూ ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా లొ 84 కరోనా అనుమానిత కేసులు వచ్చాయి. పరీక్షల రిపోర్టులు రావలసి ఉందని తెలిపారు. ప్రజలకు అనుకూలంగా ఉ. 6 నుండి ఉ.9 వరుకు మూడుగంట పాటు రోడ్ల మీదకి అనుమతిస్తారన్నారు.  పచారి షాపులు,  పళ్లుమార్కెట్, రైతు బజార్లు,   మార్కెట్ లు మాత్రమే ఈమూడు గంటలు వరుకు తెరిచి ఉంటాయన్నారు.  ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ డైరి ప్రొడెక్ట్ అందుబాటులో ఉంటాయి..అలాగే ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు  మరియు ఉ. 7 నుండి సాయంత్రం 7  వరుకు టెక్ ఎ వే హోటల్స్ కు అనుమతిస్తారు.
ప్రభుత్వ, పోలీస్, ఫైర్ ,ఎలక్ట్రసిటి, రెవిన్యూ ,  వీయంసీ , మెడికల్  హెల్త్ డిపార్ట్మెంటు వెహికల్స్ కు మాత్రమే అనుమతి.. ప్రింట్  ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్ కు,  ఆయిల్  గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి ఇచ్చామన్నరు. జ్యూవలరీ, పెద్ద మాల్స్, ఎలక్ట్రానిక్ షాప్స్ ,క్లాత్ స్టోర్స్,  ఫ్యాన్సీ షాప్స్, హార్డ్ వెర్ ,ఫర్నిచర్ , బేకరీస్  ఐస్ క్రీమ్ పార్లర్స్,  రెడీమేడ్ షాప్స్, హోటల్స్  రెస్టారెంట్స్,  ఫుడ్ కోర్ట్స్,  ఐరన్  స్టీల్ షాప్స్,  గ్లాస్  ప్లైవుడ్ షాప్స్,  పిజ్జాకాఫీ షాప్స్, మొబైల్ షాప్స్, ఆటోమొబైల్స్  పై నిషేదం ఉందని  పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండద్దని  లాక్ డౌన్ నిబంధనలను  అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని కలక్టర్ వినయ్ చంద్ హెచ్చరించారు.
 
 
 
 
No comments:
Post a Comment