Followers

రేపటి నుండి ఇంటింటికీ వెయ్యి రూపాయలు


రేపటి నుండి ఇంటింటికీ వెయ్యి రూపాయలు


నర్సీపట్నంలో 8,24,72,000/- పంపిణీ


ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే గణేష్ వెల్లడి


పెన్ పవర్, నర్సీపట్నం 


నర్సీపట్నం నియోజకవర్గంలో తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో, పేద ప్రజల ఇబ్బందులను గుర్తించి తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ హామీ నెరవేర్చే  ప్రక్రియలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 78 సచివాలయాల పరిధిలో 82,472 రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కొక్క కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున 8,24,72,000/-  పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని,  ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...