పిడుగుపాటుకు మహిళ మృతి
(పెన్ పవర్, బేస్తవారిపేట)
మండలంలోని పాత మల్లాపురం గ్రామ పొలాల్లో మేకలు కాసుకుంటున్న పల్లెబోయిన మునీశ్వరి(30) గురువారం పిడుగుపాటుకు మృతిచెందింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఈదురు గాలులు, మెరుపులతో పిడుగుపడి మహిళ మృతి చెందగా ఈమెతో పాటు 30 మేకలు చనిపోయాయి. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడగా వీరికి మెరుగైన వైద్యం కొరకు కంభం హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఎ రవీంద్రారెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment