వైద్యుల గైర్హాజరుపై జిల్లా అధికారికి ఫిర్యాదు
కొయ్యూరు...పెన్ పవర్
మండలంలోని యూ చీడీ పాలెం   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్యులు  సిబ్బంది అందుబాటులో ఉండటం  లేదని  స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రా మానికి చెందిన  జి అప్పారావు డి.రమేష్ ఎం.గోపాల్ రావులు   వైద్యాధికారులు  ల్యాబ్ టెక్నీషియన్  పై  జిల్లా మలేరియా  నిర్మూలన అధికారి  మణికి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నప్పటికీ సకాలంలో అందుబాటులో ఉండరని అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు వైద్యం అందడం లేదని వారు వాపోయారు. మారుమూల గిరిజన  గ్రామాల నుంచి  వైద్యం కోసం వచ్చినవారు  వైద్యులు లేక  అత్యవసర పరిస్థితుల్లో  తూ.గో.జిల్లా  వై రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని వారు పేర్కొన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు  చర్యలు తీసుకొని  వైద్యులు స్థానికంగా  అందుబాటులో ఉండేలా చూడాలని వారు అధికారిని  కోరారు.
 
 
 
 
No comments:
Post a Comment