Followers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్! కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 


కాకినాడ మడ అడవులపై ఉన్నత స్థాయి కమిటీని నియమించిన NGT 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్!


 


న్యూస్ డెస్క్, పెన్ పవర్


అంథ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా కాకినాడకు చెందిన విలువైన భూములు కల పట్టణంలో 50 వార్డులకు చెందిన 24,388 మంది లబ్ధిదారులను ఎంపికచేసి, వారికి నగరంలో పూర్తి స్థాయిలో భూమి లభించక పోయే సరికి, కాకినాడ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన భూములు 1978/79 నుంచి అభివృద్ధి చేయలేదు అనే ఉద్దేశంతో, సర్వే నంబరు.376 పార్టు, 375/1, 1985/పార్టు మరియు 2004/పార్టులో ఉన్న 100 ఎకరాల పైన "మడ అడవులు" ఉన్న భూమిని కలెక్టరు గారు ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకోని పేదలకు ఇళ్ళు పథకం అమలు కింద జత చేసి, మడ అడవులను నరికివేసి, అక్కడ నేలను పూర్తిగా మట్టి పోసి చదును చేయటం, అందునా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ నిభంథనలు దేశమంతా అమలులో ఉన్న సమయంలోనే చేయటంతో, స్థానికంగా ఉన్న దుమ్మల పేట, పర్లో పేట గ్రామాలకు చెందిన పల్లేకారులు రోడ్డు పైకి వచ్చి అథికారుల ప్రవర్తనను నిరసించటం జరిగింది లాక్ డౌన్ నిబందనలను కూడా ఉల్లంఘన చేసి మరీ ప్రభుత్వం జీవవైవధ్యాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని ప్రముఖ పర్యావరణ పరిరక్షణవేత్త శ్రీ బోలిశెట్టి సత్యనారాయణ గారి దృష్టికి స్థానిక పల్లేకారులు తీసుకురావటంతో అయన సదరు "మడ అడవులు" CRZ ప్రకారం రక్షిత కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిథిలో ఉన్న భూములుగా గుర్తించి, దీని పైన ప్రథాన మంత్రి, కేంద్ర అటవీశాఖ మంత్రి, రాష్ట్ర   ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ సంస్థల దృష్టిలో పెట్టినప్పటికి, మడ అడవుల నరికివేత కోనసాగుతూ ఉండటంతో, సి.అర్.జెడ్. నిబంధనలు, 2011 మరియు 2019; పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986; అటవీ పరిరక్షణ చట్టం, 1980;  వన్య ప్రాణుల పరిరక్షణ చట్టం, 1972 జాతీయ జీవ వైవిధ్య చట్టం,2002 మరియు రాజ్యాంగ అథికరణాలు.48-A, 51-A(g) ఉల్లంఘనలు కింద జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు నెంబరు.65/2020ని ది.16-04-2020న దాఖలు చేయటం జరిగింది. దీని పైన కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖలను, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టరు లను ప్రతివాదులగా చేర్చటం జరిగింది. 


దీని పైన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో నేడు అనగా ది.30-04-2020న వాదనలు జరిగినవి. 


దీని పైన రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే అంశం పైన కేసు దాఖలు చేయటం జరిగింది మరియు యథాతథ స్థితిని కోనసాగించాలని ది.27-04-2020న ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది, హైకోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ అత్యవసరంగా ఈ కేసును వినాల్సిన అవసరం లేదంటూ వాదించగా, పిటిషనరు తరపు న్యాయవాది సదరు వాదనను తిప్పికోడుతూ, హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ, ఇంకా అక్కడ పనులు జరుగుతున్నాయి అనే వాదన చేయటంతో, జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించి దిగువ తెలిపిన విథంగా ఉత్తర్వులు మథ్యంతరంగా జారీ చేయటం జరిగింది. అవి


1) ఐదుగురు సభ్యులతో కూడిన పరిశీలన బృందాన్ని నియమించటం జరిగింది. దీనిని చెన్నైకి చెందిన కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అథికారి నేతృత్వం వహిస్తారు. దీనిలో రాష్ట్ర కోస్తా తీర ప్రాంతం అథారిటీ సీనియర్ అథికారి, రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాథికారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు మరియు కాకినాడ జిల్లా అటవీ అథికారి సభ్యులుగా ఉంటారు. 


2) సదరు పైన తెలిపిన కమిటీ  నేటి నుంచి అరు నెలల వెనుక వరకు కేంద్ర అటవీ శాఖ అథ్వర్యంలో ఉన్న కాకినాడ మడ అడవుల సాటిలైట్ చిత్రాల అథారంగా సదరు ప్రాంతాన్ని పరిశీలన చేయాలి. దీనికి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సహకారం అందించాలి.


3) సదరు కమిటీ కాకినాడ మడ అడవులు నరికివేత ఏ స్థాయిలో జరిగింది, ఏంత మేరకు జరిగింది, ఏంత మేరకు మడ అడవులకు నష్టం జరిగింది, మరలా మడ అడవి పునరుద్ధరణకు ఏంత ఖర్చు అవుతుంది, మడ అడవులను నరకటం వలన పర్యావరణానికి ఏంత మేరకు నష్టం జరిగింది అనే వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలన, పరిశోధన చేసి మూడు నెలలో సదరు కమిటీ తన పూర్తి స్థాయి రిపోర్టును జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలు చేయాలి మరియు దాని కాపీలను పిటిషనరు, ప్రతివాదుల న్యాయవాదులకు కూడా అందచేయాలి.


4) ఒకవేళ సదరు మడ అడవులు ప్రాంతంలో ఏదైనా నిర్మాణాలు జరిగిన పక్షంలో, అవి జాతీయ హరిత ట్రిబ్యునల్ తుది తీర్పుకు మాత్రమే లోబడి ఉంటాయి. 


5) ఒకవేళ పై తెలిపిన కమిటీ నివేదికలో మడ అడవుల నరికివేత జరిగినట్లుగా తెలిసినచో, దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత ఉన్నతాథికారులు భాథ్యులు అవుతారని, పర్యావరణానికి జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో వారే భాథ్యులు అవుతారని, సదరు నష్టపరిహారం పూర్తిగా వారి నుంచే స్వాధీనం చేసుకుంటామని కూడా తెలియ చేసింది. 


6) తదుపరి విచారణను ది.18-08-2020కి వాయిదా వేయటం జరిగింది


లాక్ డౌన్ సమయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంపై సుప్రీం కోర్టు ప్రముఖ లాయర్ శ్రీ సంజయ్ ఉపాధ్యాయ అన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...