Followers

మోడీ ప్యాకేజీ ఓ బూటకం


మోడీ ప్యాకేజీ ఓ బూటకం


అనకాపల్లి , పెన్ పవర్


ప్రధాని మెాడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక పేకేజీ వట్టి బుాటకమని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకి కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం 82వ వార్డు లో నిర్వహించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతుా దేశంలోకి కరోన మహమ్మారి ప్రవేశించి సుమారు రెండు నెలల అవుతుందన్నారు. ఈ కాలంలో ముాడు దఫాలు లాక్ డౌన్ ప్రకటించారని, దేశప్రజలు ఐక్యంగా ఏకతాటిపై నిలబడి కరోన మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలని చెప్పి నమ్మించారని అన్నారు.దేశ ప్రజలు మెాడి పిలుపుకి కట్టుబడి నేటి వరకు ఉన్నారని అన్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించలేదని అన్నారు. దేశంలో పేదరికం , నిరుద్యోగం పెరుగుపోయిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కుాలీల,దినసరి కుాలీల  కష్టాలను ఏ మాత్రం లెక్క చేయటంలేదని విమర్శించారు.అంకెల గారఢీతో ప్రజలను నమ్మించాలని బిజెపి ప్రభుత్వం చుాస్తుందని అన్నారు.అబద్దాలు చెప్పి ఎంతో కాలం ప్రజలను మెాసం చేయలేరని అన్నారు.దేశంలో ఉన్న పేదల కుటుంబాలకు పది వేల రుాపాయలు చొప్పున చెల్లించాలని,విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ,పేదల ఇంటి అద్దెలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించావని గంగాధర్ డిమాండ్ చేసారు.పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 390 కుటుంబాలకు 3900 కోడిగుడ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో తుట్టా రమణ,దాసరి సంతోష్,రామకృష్ణ,శేషు,రుాపేష్,మైఖేల్,కనక తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...