Followers

ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో సహాయం





అనకాపల్లి , పెన్ పవర్


 లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సామాన్య, పేద వారిని ఆదుకోవడంలో ప్రతి ఒకరు చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రజలను ఆదుకునేందుకు సహకరించాలని కోరారు. కే. శ్రీనివాసరావు, ఎన్. అప్పారావు, సుబ్రహ్మణ్యం, నారాయణరావు, చరణ్, భవాని తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...