Followers

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.


అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.

 

ఏలేశ్వరం, 

 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లో పేదలకు భోజనం ప్యాకెట్ల పంపిణి గురువారం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు అనగా 54 రోజుల నుండి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సుదూర ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు నేషనల్ హైవే-16 పై కాలి నడకన వెళ్లే కూలీలకు ప్రతిరోజు ఆహార పొట్లాలు, మంచినీళ్లు వితరణ గావించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు మండల పరిధిలోని లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, ఏలేశ్వరం లో ఉన్న యాచకులకు, నిరుపేదలకు సుమారు 150 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ఏలేశ్వరం క్వారీ పేట కు చెందిన దివ్యాంగులకు  15 కేజీల బియ్యం, కూరగాయలు వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాసరి మృత్యుంజయ శర్మ, నూకల సుబ్రమణ్యం, బండి నరసింహ మూర్తి, చాగంటి నరసింహారావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...