Followers

జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన

జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన


   గోడ పత్రికను విడుదల చేసిన సిఐటియు గనిశెట్టి

 

             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం:కేంద్ర ప్రభుత్వం కార్మికుల,ఉద్యోగుల హక్కుల యెక్క సేసనాలను ఉల్లంఘన చేస్తున్న కారణంగా జులై 3 వ తారీకున అన్ని ఉద్యోగ సంఘాల తో కలిసి సిఐటియు వారి ఆధ్వర్యంలో శహయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనాలి గోడ పత్రికను సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ విడుదల చేసారు.అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ జులై 3 నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమంలో ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు.కరోనా స్వీయ నిర్బంధం వలన ఎందరో కార్మికులు ఉపాధి కోల్పోయారు అని వారిని వెంటనే ఆదుకోవాలి అని అన్నారు.పరిశ్రమల్లో,సవస్థల్లో ని కార్మికులను తొలగించి రాదు అని అన్నారు.కార్మికులకు లాక్ డవున్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కరోనా వైరస్ సోకకుండా భవన నిర్మాణ కార్మికులకు,వాలంటీర్లకు,ఉద్యోగులకు రక్షణ కల్పించాలి అని వారికి బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ,ప్రభుత్వ సవస్థలను ప్రవేటికరణ చేయాలి అని బీజేపీ ప్రభుత్వo చేస్తున్న చర్యలను ఉద్యోగులు వ్యతిరేకించండి అని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గేదల అప్పారావు,కె అప్పారావు,బి లచ్చిబాబు,జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...