Followers

79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


79,85 వార్డుల్లో ని జివిఎంసి త్రాగునీటి సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు అందించిన కింతాడా


             పరవాడ పెన్ పవర్

పరవాడ మండలం:అగనంపూడి జివిఎంసి పరిధిలో 79,85 వ వార్డుల్లో పనిచేస్తున్న త్రాగునీటి సిబ్బందికి మరియు పంపు ఆపరేటర్ల కు 79 వ వార్డ్ జనసేన అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు(అడ్వకేట్)ఆధ్వర్యంలో శానిటైజర్లు,మాస్కులు అందించడం జరిగింది.అనంతరం కింతాడ మాట్లాడుతూ ప్రతిరోజు తమ విధులు నిర్వహిస్తున్న త్రాగునీరు సరఫరా చేస్తున్న సిబ్బంది కరోనా భారిన పడకుండా తమని తాము రక్షించు కోవడానికి వారికి శానిటైజర్లు,మాస్కులు అందించినట్లు చెప్పారు.వీరందరూ జాగ్రత్తగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా వుంటారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో దుల్ల రామునాయుడు,బుద్దిరెడ్డి అప్పారావు,బిసి సంఘం అధ్యక్షుడు తోకాడ రాము,కర్రి వరప్రసాథ్,గుర్రాల చిన్న రాజు,నక్క దేముడు,జన సైనికులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...