జి ప్లస్ టు గృహాలను వెంటనే అప్పగిచాలంటూ అమ్మానమ్మా వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సి పి ఎం నాయకులు
సామర్లకోట, పెన్ పవర్
.సామర్లకోట మునిసిపాలిటీ పరిధి లో అమ్మానమ్మా అపార్టుమెంటు వద్ద,పిఠాపురం రోడ్డులోని ఉప్పువారి సత్రం ఎదురుగా నిర్మించిన జి ప్లస్ టు ప్లాటులను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ప్లాటుల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.సిపిఎం బృందం ఆధ్వర్యంలో పార్టీ జెండాలను పట్టి ప్లాటుల్లోకి వెళ్లి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు కారణం ప్రసాదరావు మాట్లాడుతూ ప్లాటులవద్ద వద్ద ఇంకా త్రాగునీరు,రహదారుల, డ్రాయిన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు జరగలేదు అన్నారు.వాటిని వెంటనే ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు.ఇప్పటికే ప్లాటులకు సంబంధించి లబ్దివారు వాటాగా అన్ని విడతల సొమ్మును చెల్లించి దానికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ను అద్దె గృహాల్లో ఉండి అద్దెలు చెల్లించలేని స్థితిలోను ప్రజలున్నoదున ఈ విషయాలు ఎమ్మెల్యేలు,ఎం పి లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధిదారులకు వారి ప్లాటులను అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు,పాల్గొని తహసీల్దార్ వి జితేంద్ర కు వినతి పత్రాన్ని అందజేశారు.
No comments:
Post a Comment