Followers

ఎంపిటిసి, జెడ్పిటిసి లకు కొత్తగా నామినేషన్ వేసుకునే అవకాశం...

ఎంపిటిసి,  జెడ్పిటిసి లకు కొత్తగా నామినేషన్ వేసుకునే అవకాశం... 

కోరినవారికి ఎన్నికల అధికారులు అవకాశం  కల్పించాలి

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క.నాగేశ్వరరావు డిమాండ్ 



జగ్గంపేట, పెన్ పవర్


జగ్గంపేట మండలం జగ్గంపేట ట్రావెల్స్ బంగ్లా లో ఆయన పార్టీ కార్యకర్తలు సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అందరికీ అవకాశం కల్పించాలని ఆయన మాట్లాడుతూ తెలియజేశారు. ఎమ్ పి టి సి, జెడ్ పి టి సి లు గా  రాష్ట్రంలో నామినేషన్ వేసి సంవత్సరం కాలం అయినది .కరోనా మహమ్మారి ప్రాణాంతకమైన వ్యాధి వలన ఎన్నికలు వాయిదా పడడం జరిగినది  అందునిమిత్తము యువతీ యువకులు ఉత్సాహవంతులు వారెవరైనా ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి నామినేషన్ వేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను కోరినవారికి ఎన్నికల అధికారులు అవకాశం కల్పించి గ్రామ ప్రజలకు  సేవ చేసుకునే  అవకాశం వారికి కల్పించాలి, అప్పటిలో గ్రామ సర్పంచ్ మరియు వార్డ్ నెంబర్లుకు నామినేషన్ వేయనందన  ఈరోజు యువతీయువకులకు ఉత్సాహవంతులకు గ్రామానికి సేవ చేసుకునే అవకాశం మొదటి రెండవ విడతల్లో జరిగిన ఎన్నికల్లో దక్కిందనది అలాగే ఎం పి టి సి, జెడ్ పి టి సి, నామినేషన్లు వేసుకునే అవకాశం కోరిన వారికి ఎన్నికల అధికారులు అవకాశాన్ని కల్పించి వారి అదృష్టాన్ని పరీక్షించుకునే  అవకాశం కల్పించాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...