ఈ నెల 5వ తారీఖున జరిగే బంద్ ను జయప్రదం చేయండి
వి.ఆర్.పురం మండలం రేఖపల్లి సెంటర్ లో కిరాణా షాపులు వారికి గ్రామ ప్రజలకు సిపిఎం, సి ఐ టి యు, గిరిజన రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కరపత్రాలు ప్రజలందరికీ ఇవ్వటంజరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సీనియర్ నాయకులు కారం సిరామయ్య మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రయివేట్ పరం చేసి,ఈ దేశాన్ని పూర్తీగా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే "విశాఖ ఉక్కు స్టిల్స్" ను ప్రయివేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనకు పూనుకుందని ఆయన అన్నారు. తదుపరి జిల్లా కమిటీ సభ్యులు బొపెన కిరణ్ మాట్లాడుతూ ఐదవ తేదీన జరగబోవు బంద్ లో ప్రతీ ఒక్కరు కలిసికట్టుగా పాల్గొని బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సి.పి.యం సీనియర్ నాయకులు మాజీ MPP కారం.శిరమయ్య,జిల్లాకమిటి సభ్యులు బొప్పెన.కిరణ్, సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు పూనెం.సత్యనారాయణ, శ్రీరామగిరి సర్పంచ్ పులి.సనోథ్ కుమార్,నాయకులు పంకు.సత్తిబాబు,పోడియం.శ్రీరాముర్తి,గుండెపుడి.లక్ష్మణ్ రావు,నాళ్లరపు.ప్రకాశ్ రావు,ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment