Followers

బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు

 బంగారు లక్ష్మణ్  82వ జయంతి వేడుకలు

తాండూర్,పెన్ పవర్

మంచిర్యాల జిల్లా తాండూర్ తేదీ 17 మార్చి 2021 రోజున ఎస్సీ మోర్చా తాండూర్ మండల అధ్యక్షులు ఏముర్ల రవి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా పనిచేసిన కీ॥శే॥ బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు తాండూర్ ఐబి లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాజపా మండల అధ్యక్షుడు రామగౌని మహీధర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు గా బంగారు లక్ష్మణ్ గారు ప్రవేశ పెట్టిన "అంత్యోదయ సిద్దాంతం" పాటిస్తూ ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి కి అందేలా ప్రవేశ పెట్టబడిన అయన సిద్ధాంతాలు తప్పక పాటిస్తాం అని ప్రమాణం చేస్తూ అయన పార్టీ కి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ మహనీయునికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,మండల ఉపాధ్యక్షులు కోమండ్ల శ్రీనివాస్,మండల ప్రధాన కార్యదర్శి పట్టెం విష్ణుకళ్యాణ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్,మండల కోశాధికారి రాచర్ల సురేష్, మండల కార్యవర్గ సభ్యులు కటకం నాగయ్య,సిద్ధం మల్లేష్,రాచర్ల సాయిరాం తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...