Followers

స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

 స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి




మందమర్రి,  పెన్ పవర్ 

దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన స్వాతంత్ర సమరయోధులు వారి జీవితాలను త్యాగం చేశారని, ఆ త్యాగాధనుల త్యాగాలను స్మరించుకుంటూ,75 సంవత్సరాలలో దేశం సాధించిన ప్రగతిని, అభివృద్ధిని, విజయాలను గుర్తు చేసుకోవాలని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత్ కా అమృత్ మహోత్సవం  కార్యక్రమంలో భాగంగా బుధవారం మందమర్రి ఏరియాలోని కేకే గ్రూప్ ఏజెంట్ కార్యాలయం నుండి స్థానిక జిఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం జిఎం కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 ,1930 సంవత్సరంలో మహాత్మా గాంధీ దండి సత్యాగ్రహం ప్రారంభించిన రోజున సబర్మతి ఆశ్రమం ఉండే భారత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా జూన్ 30 వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంస్థలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ, సంస్థ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, టీబీజీకేఎస్ స్టృక్చర్ కమిటీ సభ్యులు శంకర్ రావు, ఏఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, ఏరియాలోని అన్ని గనులు, విభాగాల ఏజిఎం లు, హెచ్ఓడి లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...