శామీర్ పెట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం..
తమిళ నాడుకు వెల్తున్న కెమికల్ లారీ..ఒక కంటైనర్ అగ్నికి ఆహూతి..
ప్రమాద సమయంలో లారీలో నలుగురు.. సూపర్ వైజర్ ముఖేశ్ మంటల్లో మృతి..
పెన్ పవర్,శామీర్ పెట్
నగర శివారులోని రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి, ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు.. మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈసంగటన వివారాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని సేలంకు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు డ్రైవర్ తివారీ తెలిపాడు.. రెండు లారీలు మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని. ఈ ప్రమాద సమయంలో లారీలో మొత్తం నలుగురు ఉన్నట్టు డ్రైవర్ తివారీ తెలిపాడు.. ముగ్గురం బయట పడ్డామని,తమ సూపర్ వైజర్ ముఖేష్ అనే వ్యక్తి కాలుజారి కారి కింద మంటల్లో పడిపోయి సజీవ దహనమయ్యాడని డ్రైవర్ తివారీ పేర్కొన్నాడు.. సమాచారం తెలుసుకున్న శామీర్ పేట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. అగ్నిమాపక సిబ్బంది తీవ్ర కృషిచేసి మంటలు ఆర్పినా ఫలితం దక్కలేదు.. రెండు లారీలు పూర్తిగా ఖాళీ పోయాయి.. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



No comments:
Post a Comment