అభం శుభం తెలియని పసికందును వదిలేశారు
తాంసి , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలోని పొన్నారి గ్రామ సమీపంలో పోజింగ్ ఫ్యాక్టరీ దగ్గర బుధవారం అభం శుభం తెలియని ఓపసికందును చున్నీతో కట్టినట్టు వంటి ఉయ్యాలలో పడుకోబెట్టి వదిలేసి వెళ్లిపోయినా స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అందించిన సమాచారం ప్రకారం వెంటనే తాంసీ ఎస్ఐ శిరీష , బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ , చైల్డ్ లైన్ జిల్లా సమన్వయకర్త తిరుపతి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోని పసికందును వైద్యపరీక్షల నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ కి తరలించరు. వైద్య పరీక్షల అనంతరం ఈ పసికందును శిశు గృహ లో చేర్పించడం జరుగుతుందని తెలియజేశారు.ఇట్టి పసికందుకు సంబంధించిన వివరాల కోసం డీసీపీవో రాజేంద్రప్రసాద్ గారిని,9440555872 చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ తిరుపతి గారిని 9989581713 ఫోన్ చేసి సంప్రదించగలరు లేదా స్థానిక తాంసి పోలీస్ స్టేషన్ సంప్రదించవలసినదిగా పేర్కొన్నారు.

No comments:
Post a Comment