మండల కేంద్రంలో జాలం సింగ్ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం
గురువారం మండల కేంద్రంలో జాలం సింగ్ స్మారకార్థం అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీపీ కనక మోతుబయి మాజీ జెడ్పిటిసి బానోత్ జాలం సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బానోత్ జాలం సింగ్ వివిధ హోదాల్లో మండల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసి ఆయన ఆశయాలను నెరవేర్చాలన్నారు. క్రీడా పోటీల తో స్నేహభావం ఏర్పడిన మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. క్రీడా పోటీల్లో మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో తహేసిల్దార్ దుర్వా లక్ష్మీన్, సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, ఉపసర్పంచ్ మహేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆడే సురేష్, ఎంపీటీసీ లు పరమేశ్వర్, రేణుక దిలీప్, కనక ప్రభాకర్, కరీం ఖాన్, బాలాజీ కాంబ్లే, బంజారా సేవా సంఘం నాయకులు శ్రీ రామ్ నాయక్, రామారావు, రితేష్ రాథోడ్, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు చౌహాన్ హరి చంద్, సికిందర్ ,అమరేందర్ ,ప్రతాప్ సింగ్, బిక్షపతి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment