వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ కె టి హరిచంద్ర రెడ్డి
పెన్ పవర్, సత్యవేడు
చిత్తూరు జిల్లా పిచ్చా టూరు మండలం సిద్దిరాజుల కండ్రిగ రైతు భరోసా కేంద్రం నందు వేరుశనగ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు మధ్య వ్యాపారం విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి రైతు భరోసా కేంద్రం నందు కొనుగోలు కేంద్రాన్ని ప్రవేశపెట్టారని అన్నారు మండలంలోని రైతులు తమ వేరుశనగ కాయలను ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కేంద్రంలో వేయాలని కోరారు.అనంతరం ఏ ఓ కోదండయ్య మాట్లాడుతూ రైతులు వేరుశనగ కాయలు దళారులు విక్రయించడం వలన రైతులు నష్టపోతున్నారు కాయలను విక్రయిం చదవలసిన రైతులు వెంటనే ఆర్ బి కె లో ఉన్న విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు రైతులు పత్రాలు పాసు పుస్తకం,ఆధార్ కార్డు,బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకొని వచ్చి అగ్రిమెంట్ చేసుకొని గోనే సంచులు తీసుకోవాలని తెలిపారు.
వేరుశనగ కాయలు ఉండవలసిన నాణ్యత ప్రణాళిక
1. తేమశాతం 9./. తక్కువ
2. గింజ శాతం 74./. కన్న తక్కువ
3. వ్యర్థ పదార్థములు 4./. కన్న తక్కువ
4. ఫిసికల్ ప్యూరిటీ 96./.
ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పవిత్ర, ప్రశాంత్,గజలక్ష్మి,చంద్రశేఖర్,సిద్దిరాజుల కండ్రిగ సర్పంచ్ సుకేశ్ స్వప్న,రాజానగరం సర్పంచ్ భూపతి,వైఎస్సార్సీపీ నాయకులు పాండియన్,గోవిందన్,రైతులు జ్యోతిరాజు,బాబునాయుడు,సుధాక రాజు,గ్రామస్థులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment