జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలి
జీవీఎంసీ కొత్త పాలకవర్గం విశాఖ సమస్యలపై ద్రుష్టి సారించాలని విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర్రావు కోరారు.గురువారం మీడియా కు విడుదల చేసిన ప్రకటనలో మేయర్ గా ఎన్నికైన గోలగాని హరి వెంకట కుమారి,డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన జియ్యాని శ్రీధర్, ప్రమాణస్వీకారం చేసిన కార్పొరేటర్ లకు అభినందనలు తెలిపారు.విశాఖలో పేరుకుపోయిన ఎన్నో సమస్యలపై పాలక వర్గం దృష్టిసారించాలని కోరారు.విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి సమావేశంలోనే తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేసారు.రాజకీయాలకతీతంగా విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకముగా అందరమూ కలిసి పోరాడదామని సంకు పిలుపునిచ్చారు.

No comments:
Post a Comment